ETV Bharat / state

'మేం ఫీజులన్ని కట్టినాం.. మా హాల్​టికెట్లు మాకు కావాలి'

SSC EXAMS 2023 in Sangareddy: అనుమతులు లేకున్నా అడ్మిషన్లు తీసుకున్న ప్రైవేట్ పాఠశాల నిర్వాకంతో పదో తరగతి విద్యార్థులు వార్షిక పరీక్షలకు దూరమయ్యారు. సగం పరీక్షలు అవుతున్న హాల్​టికెట్లు ఇవ్వకపోడంతో బాధిత విద్యార్థులు పోలీసులను ఆశ్రయించారు. దీంతో ఈ పాఠశాల ప్రిన్సిపల్​ని అరెస్ట్​ చేశారు.

author img

By

Published : Apr 9, 2023, 3:56 PM IST

Students who missed the 10th class annual exams
పదో తరగతి వార్షిక పరీక్షలకు దూరమైన విద్యార్థులు
అనుమతులు లేని ప్రైవేట్​ స్కూల్లో చదివిన పదో తరగతి విద్యార్థుల పరీక్షలకు దూరమైయ్యారు

SSC EXAMS 2023 in Sangareddy: అందరి విద్యార్థులులాగానే వారు కూడా స్కూల్​కి వెళ్లి పదో తరగతి పరీక్షలకు సన్నద్దం అయ్యారు. పరీక్షలు సమయం వచ్చిన వారికి ఆ పాఠశాల యాజమాన్యం హాల్​టికెట్లు ఇవ్వలేదు. దీంతో వారు ఎగ్జామ్స్ రాయలేదు. ప్రిన్సిపల్​ మేడంని అడిగితే తరువాత పరీక్షకు ఇస్తామంటూ ఆ విద్యార్థిలకు నచ్చ చెప్పారు. చివరికి సగంపైగా పరీక్షలు అయిపోయిన వారికి పరీక్షలు రాసే అవకాశం రాలేదు. దీంతో ఆ విద్యార్థులు పోలీసులను సంప్రదించారు. విచారణ జరిపితే మరిన్ని నిజాలు వెలుగులోకి వచ్చాయి.

జహీరాబాద్​ ఎస్​ఐ శ్రీకాంత్, బాధిత విద్యార్థులు ​తెలిపిన వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలోని ఆక్స్​ఫర్డ్ పాఠశాల యాజమాన్యం పదో తరగతి నిర్వహణకు అనుమతులు లేకుండా 8 మంది విద్యార్థులను అడ్మిషన్ చేసుకుంది. తీరా పరీక్ష ఫీజులు సహా పాఠశాల ఫీజులు సైతం దర్జాగా వసూలు చేసింది. వార్షిక పరీక్షలు ప్రారంభం కావస్తున్న రేపు మాపంటూ కాలయాపన చేస్తూ వచ్చింది. సగానికి పైగా పరీక్షలు పూర్తయిన ఇంకా హాల్​టికెట్లు ఇవ్వక పోవడంతో శనివారం విద్యార్థులు, తల్లిదండ్రులు జహీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అనుమతులు లేకున్న పదో తరగతి ప్రవేశాలు తీసుకోవడం పట్ల పోలీసులు కేసు నమోదు చేసి ప్రిన్సిపల్ ఇందిరను అదుపులోకి తీసుకొని రిమాండ్​కు తరలించారు.

మాకు హాల్​టికెట్లు కావాలి: విద్యార్థులకు జరిగిన నష్టంపై విద్యాధికారి బసవరాజు తనకు ఏమీ తెలియదన్నట్టు సమాధానం ఇవ్వడం పట్ల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పట్టణంలో ఏ పాఠశాలకు అనుమతులు ఉన్నాయో లేదో తెలుసుకోవాల్సిన బాధ్యత ఉన్న విద్యాధికారే నిర్లక్ష్యంగా వ్యవహరించి ఎనిమిది మంది పిల్లల భవిష్యత్తు నాశనమయ్యేలా చేశారని ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం విద్యాశాఖ తమకు హాల్​టికెట్లు అందించి పరీక్షలు రాసేలా అవకాశం కల్పించాలని విద్యార్థులు కోరుతున్నారు.

"నేను సంగారెడ్డి జిల్లాలో ఆక్స్​ఫర్డ్​ స్కూల్​లో పదో తరగతి చదువుతున్నాను. పరీక్షల ముందు ప్రిన్సిపల్ మేడం హాల్​టికెట్​ ఇస్తానన్నారు. అందరూ పరీక్షలు రాస్తున్న మాకు ఇంకా హాల్​టికెట్​లు ఇవ్వలేదు. టీచర్​ని అడిగితే ప్రభుత్వం వల్ల ఇవ్వలేదని అంటున్నారు. మాకు స్కూల్​ సమస్య, గవర్నమెంట్​ సమస్య మాకు తెలియదు. మాకైతే హాల్​టికెట్​లు కావాలి. మేమందరం 8 మంది. ఇప్పటి వరకు మాకు ఒక్క ఎగ్జామ్​ రాయించలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశాం. మీకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. మమ్మల్ని పరీక్షలకు అనుమతించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం."- రాహుల్, బాధిత విద్యార్థి

"విద్యార్థులు మాకు పరీక్షలకు హాల్​టికెట్లు ఇవ్వలేదని ఫిర్యాదు చేశారు. మేము విచారణ చేయగా ఆక్స్​ఫర్డ్ స్కూల్​ 8 మంది పదో తరగతి విద్యార్థులకు అనుమతులు లేకుండా తరగతులు నిర్వహించింది. వారి దగ్గర నుంచి స్కూల్​ ఫీజులు, పరీక్ష ఫీజులు వసూలు చేసింది. దీంతో పాఠశాల ప్రిన్సిపల్​ ఇందిరాపై కేసు నమోదు చేశాం. ఆమెను విచారించిన అనంతరం అరెస్ట్​ చేశాం. కోర్టులో కూడా ప్రవేశపెట్టాం. ఇంకా ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నాం. తదుపరి సమాచారం తెలియజేస్తాం." - శ్రీకాంత్, జహీరాబాద్ ఎస్ఐ

ఇవీ చదవండి:

అనుమతులు లేని ప్రైవేట్​ స్కూల్లో చదివిన పదో తరగతి విద్యార్థుల పరీక్షలకు దూరమైయ్యారు

SSC EXAMS 2023 in Sangareddy: అందరి విద్యార్థులులాగానే వారు కూడా స్కూల్​కి వెళ్లి పదో తరగతి పరీక్షలకు సన్నద్దం అయ్యారు. పరీక్షలు సమయం వచ్చిన వారికి ఆ పాఠశాల యాజమాన్యం హాల్​టికెట్లు ఇవ్వలేదు. దీంతో వారు ఎగ్జామ్స్ రాయలేదు. ప్రిన్సిపల్​ మేడంని అడిగితే తరువాత పరీక్షకు ఇస్తామంటూ ఆ విద్యార్థిలకు నచ్చ చెప్పారు. చివరికి సగంపైగా పరీక్షలు అయిపోయిన వారికి పరీక్షలు రాసే అవకాశం రాలేదు. దీంతో ఆ విద్యార్థులు పోలీసులను సంప్రదించారు. విచారణ జరిపితే మరిన్ని నిజాలు వెలుగులోకి వచ్చాయి.

జహీరాబాద్​ ఎస్​ఐ శ్రీకాంత్, బాధిత విద్యార్థులు ​తెలిపిన వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలోని ఆక్స్​ఫర్డ్ పాఠశాల యాజమాన్యం పదో తరగతి నిర్వహణకు అనుమతులు లేకుండా 8 మంది విద్యార్థులను అడ్మిషన్ చేసుకుంది. తీరా పరీక్ష ఫీజులు సహా పాఠశాల ఫీజులు సైతం దర్జాగా వసూలు చేసింది. వార్షిక పరీక్షలు ప్రారంభం కావస్తున్న రేపు మాపంటూ కాలయాపన చేస్తూ వచ్చింది. సగానికి పైగా పరీక్షలు పూర్తయిన ఇంకా హాల్​టికెట్లు ఇవ్వక పోవడంతో శనివారం విద్యార్థులు, తల్లిదండ్రులు జహీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అనుమతులు లేకున్న పదో తరగతి ప్రవేశాలు తీసుకోవడం పట్ల పోలీసులు కేసు నమోదు చేసి ప్రిన్సిపల్ ఇందిరను అదుపులోకి తీసుకొని రిమాండ్​కు తరలించారు.

మాకు హాల్​టికెట్లు కావాలి: విద్యార్థులకు జరిగిన నష్టంపై విద్యాధికారి బసవరాజు తనకు ఏమీ తెలియదన్నట్టు సమాధానం ఇవ్వడం పట్ల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పట్టణంలో ఏ పాఠశాలకు అనుమతులు ఉన్నాయో లేదో తెలుసుకోవాల్సిన బాధ్యత ఉన్న విద్యాధికారే నిర్లక్ష్యంగా వ్యవహరించి ఎనిమిది మంది పిల్లల భవిష్యత్తు నాశనమయ్యేలా చేశారని ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం విద్యాశాఖ తమకు హాల్​టికెట్లు అందించి పరీక్షలు రాసేలా అవకాశం కల్పించాలని విద్యార్థులు కోరుతున్నారు.

"నేను సంగారెడ్డి జిల్లాలో ఆక్స్​ఫర్డ్​ స్కూల్​లో పదో తరగతి చదువుతున్నాను. పరీక్షల ముందు ప్రిన్సిపల్ మేడం హాల్​టికెట్​ ఇస్తానన్నారు. అందరూ పరీక్షలు రాస్తున్న మాకు ఇంకా హాల్​టికెట్​లు ఇవ్వలేదు. టీచర్​ని అడిగితే ప్రభుత్వం వల్ల ఇవ్వలేదని అంటున్నారు. మాకు స్కూల్​ సమస్య, గవర్నమెంట్​ సమస్య మాకు తెలియదు. మాకైతే హాల్​టికెట్​లు కావాలి. మేమందరం 8 మంది. ఇప్పటి వరకు మాకు ఒక్క ఎగ్జామ్​ రాయించలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశాం. మీకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. మమ్మల్ని పరీక్షలకు అనుమతించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం."- రాహుల్, బాధిత విద్యార్థి

"విద్యార్థులు మాకు పరీక్షలకు హాల్​టికెట్లు ఇవ్వలేదని ఫిర్యాదు చేశారు. మేము విచారణ చేయగా ఆక్స్​ఫర్డ్ స్కూల్​ 8 మంది పదో తరగతి విద్యార్థులకు అనుమతులు లేకుండా తరగతులు నిర్వహించింది. వారి దగ్గర నుంచి స్కూల్​ ఫీజులు, పరీక్ష ఫీజులు వసూలు చేసింది. దీంతో పాఠశాల ప్రిన్సిపల్​ ఇందిరాపై కేసు నమోదు చేశాం. ఆమెను విచారించిన అనంతరం అరెస్ట్​ చేశాం. కోర్టులో కూడా ప్రవేశపెట్టాం. ఇంకా ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నాం. తదుపరి సమాచారం తెలియజేస్తాం." - శ్రీకాంత్, జహీరాబాద్ ఎస్ఐ

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.