ETV Bharat / state

ముంపు కాలనీల్లో పర్యటించిన ఎంపీ, ఎమ్మెల్యే

author img

By

Published : Oct 14, 2020, 3:33 PM IST

జహీరాబాద్​లోని వరద ముంపు కాలనీల్లో ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే మాణిక్ రావు పర్యటించారు. కుండపోత వర్షానికి జలమయంగా మారిన డ్రీమ్ ఇండియా, ఇంద్రప్రస్థ కాలనీ, అల్గోల్ బైపాస్ కూడలిని సందర్శించారు.

mp-mlas-visited-flood-colonies-at-zaheerabad-sangareddy
ముంపు కాలనీల్లో పర్యటించిన ఎంపీ, ఎమ్మెల్యే

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్​లో వరద ముంపు కాలనీల్లో ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే మాణిక్ రావు పర్యటించారు. కుండపోత వర్షానికి జలమయంగా మారిన డ్రీమ్ ఇండియా, ఇంద్రప్రస్థ కాలనీ, అల్గోల్ బైపాస్ కూడలిని సందర్శించారు.

వరద ఉద్ధృతిపై ఆర్డీఓ రమేష్ బాబు, డీఎస్పీ శంకర్ రాజును వివరాలు అడిగి తెలుసుకున్నారు. పట్టణ ప్రజలు ఇబ్బందులు పడకుండా మున్సిపల్ అధికారులు, సిబ్బందితో అప్రమత్తంగా ఉండి నాలాలు పొంగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. కొత్తూరు(బి) నారింజ ప్రాజెక్టును సందర్శించి జలవనరుల శాఖ అధికారులకు పలు సూచనలిచ్చారు. వర్షానికి కూలిన ఇళ్లు, డివిజన్​లో పంట నష్టంపై అంచనాలు రూపొందించాలని అధికారులకు తెలిపారు.

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్​లో వరద ముంపు కాలనీల్లో ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే మాణిక్ రావు పర్యటించారు. కుండపోత వర్షానికి జలమయంగా మారిన డ్రీమ్ ఇండియా, ఇంద్రప్రస్థ కాలనీ, అల్గోల్ బైపాస్ కూడలిని సందర్శించారు.

వరద ఉద్ధృతిపై ఆర్డీఓ రమేష్ బాబు, డీఎస్పీ శంకర్ రాజును వివరాలు అడిగి తెలుసుకున్నారు. పట్టణ ప్రజలు ఇబ్బందులు పడకుండా మున్సిపల్ అధికారులు, సిబ్బందితో అప్రమత్తంగా ఉండి నాలాలు పొంగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. కొత్తూరు(బి) నారింజ ప్రాజెక్టును సందర్శించి జలవనరుల శాఖ అధికారులకు పలు సూచనలిచ్చారు. వర్షానికి కూలిన ఇళ్లు, డివిజన్​లో పంట నష్టంపై అంచనాలు రూపొందించాలని అధికారులకు తెలిపారు.

ఇదీ చూడండి : 'రాష్ట్రంలో వర్ష బీభత్సాన్ని జాతీయ విపత్తుగా గుర్తించాలి'

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.