ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలతోనే రైతుకు గిట్టుబాటు ధర దక్కుతుందని జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు, ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్ అన్నారు. దళారులకు విక్రయించి నష్టపోకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలోనే అమ్ముకోవాలని సూచించారు.
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయం ఆవరణలో కందుల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో క్వింటాలుకు రూ.5,100 ధరకు కందులు అమ్ముకొని లాభాలు పొందాలని ఎమ్మెల్సీ సూచించారు.జహీరాబాద్, మొగుడంపల్లి, కోహిర్, ఝరాసంగం, న్యాల్కల్, రాయికోడ్, మునిపల్లి మండలాల రైతులకు ఉపయోగపడుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
ఇదీ చూడండి: 'గొర్రెల పంపిణీకి 3 వేల కోట్లు కేటాయించడం సంతోషం'