సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ ప్రాంతంలో పర్యటించిన రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు స్థానిక మహిళలతో ముచ్చటించారు. నారాయణఖేడ్ నుంచి సిర్గాపూర్ మండలంలోని బొక్కాసు గ్రామం వెళ్తుండగా దారిలో ఉపాధి హామీ పనికి చేసి తిరిగి వెళ్తున్న మహిళలతో మంత్రి మాట్లాడారు. వారి యోగక్షేమాలు కనుక్కున్నారు. కరోనా వ్యాధి గురించి ప్రజలకు ఎంత అవగాహన ఉందో పరిశీలించారు. అక్కడ గుమిగూడిన వారిని దూరదూరంగా ఉండాలని వారిస్తూనే.. కరోనా వ్యాధి గురించి వివరించారు. వ్యాధి సంక్రమించే విధానాన్ని గ్రామీణ ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్పారు.
ఇవీ చూడండి: 24 గంటల్లో 1,383 కొత్త కేసులు- 50మరణాలు