సంగారెడ్డి శివారులోని ఎంఎన్ఆర్ ఆసుపత్రిలో వట్పల్లి మండలం నిర్జప్ల గ్రామానికి చెందిన లక్ష్మి మృతి చెందింది. మంగళవారం అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన లక్ష్మిని వైద్యులు పట్టించుకోకపోవడం వల్లే మృతి చెందిందని బంధువులు ఆరోపించారు. న్యాయం జరిగే వరకు శవాన్ని తీసుకెళ్లేది లేదని ఆసుపత్రి ముందు బైఠాయించారు. పోలీసులు చర్చలు జరిపినా ఫలించలేదు.
ఇవీ చూడండి: ఇంట్లో చెప్పుకోలేక.. బెట్టింగ్ డబ్బులు కట్టలేక...