ఫర్నిచర్ దుకాణంలో అగ్నిప్రమాదం సంగారెడ్డి జిల్లా పటాన్చెరులోని ఓ ఫర్నిచర్ తయారీ దుకాణం బయట ఉన్న సామగ్రి అగ్నికి ఆహుతైంది. ఫర్నిచర్ తయారుచేస్తుండగా వస్తున్న శబ్ధాలతో ఇబ్బందిగా ఉందని.. గత రాత్రి ఓ వ్యక్తి తనతో గొడవకు దిగాడని దుకాణ యాజమాని వెంకటేష్ తెలిపాడు. ఆయనే ఘటనకు కారణమని అనుమానం వ్యక్తంచేశాడు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరాడు.