తమకు కేటాయించిన భూములను తిరిగి అప్పగించాలంటూ 95 ఏళ్ల స్వాతంత్య్ర సమరయోధురాలు, ఇతరుల వారసులు సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రాలు అందజేశారు. తమకు తెలియకుండానే వాటిని రద్దు చేసినట్లు పదినెలల క్రితం నోటీసులు అందించారని బాధితులు వెల్లడించారు.
మెదక్ జిల్లా అల్లాదుర్గ్, టేక్మాల్ మండల వాసులకు కొల్లూరులోని సర్వేనంబరు 191లో రెండు ఎకరాల భూమి కేటాయించిందని తెలిపారు. స్వాతంత్య్ర సమరయోధుల కోటాలో 1996లో మంజూరు చేశారన్నారు. ఇప్పుడు రద్దు చేస్తున్నట్లు నోటీసులు ఇవ్వడం సరికాదని వాపోయారు. తమ భూమిని కేటాయించాలని వారు విజ్ఞప్తి చేశారు.