సంగారెడ్డి జిల్లాలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోందని స్థానిక వైద్యాధికారి తెలిపారు. అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో స్థానికంగా నివాసముండే ఓ వ్యక్తికి కొవిడ్ పాజిటివ్గా తేలినట్టు మున్సిపల్ కమిషనర్ సుజాత ధ్రువీకరించారు. పటాన్చెరు మండలంలోని బీడీఎల్ పరిశ్రమలో విధులు నిర్వర్తిస్తున్న ముగ్గురు సీఐఎస్ఎఫ్ భద్రతా సిబ్బందికి కూడా కరోనా నిర్ధరణ అయినట్టు స్థానిక వైద్యాధికారి పెంటయ్య తెలిపారు.
పటాన్చెరులోని చైతన్యనగర్ కాలనీకి చెందిన ఓ వ్యక్తి... జలుబు, దగ్గు లక్షణాల అనుమానంతో నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకున్నాడు. రిపోర్ట్లో కరోనా పాజిటివ్ అని తేలింది. అయితే అతనిలో వైరస్ లక్షణాలు కనిపించకపోవడం వల్ల... సోమవారం నాడు అతడిని ఇంట్లోనే ఉంచి మంగళవారం సంగారెడ్డి జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు.
ఇదీ చూడండి :