Indiramma Atmiya Bharosa Funds Released : రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి కూలీలకు తీపి కబురు అందించింది. ఉపాధి కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నిధులు విడుదల చేసింది. ఎన్నికల కోడ్ అమల్లో లేని ఉమ్మడి రంగారెడ్డి, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాల్లో ఉపాధి కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నిధులు జమ చేస్తోంది. ప్రభుత్వం జనవరి 26వ తేదీన ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని ప్రారంభించింది. ప్రతి మండలంలోని ఒక పైలెట్ గ్రామంలో గ్రామ సభలు నిర్వహించి కూలీల ఖాతాల్లో నిధులు 18,180మందికి రూ.6వేలు చొప్పున జమ చేసింది.
ఆ తర్వాత మండలి ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నిలిచిపోయింది. అయితే ఎన్నికల కోడ్ అమలులోలేని జిల్లాలకు నిధులు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని మంత్రి సీతక్క విజ్ఞప్తి చేసింది. ఉమ్మడి మహబూబ్నగర్, రంగారెడ్డి జిల్లాలకు 66,240 మంది ఉపాధి కూలీ లబ్ధిదారులకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నిధులను చెల్లించారు. 66,640 మంది కూలీల ఖాతాల్లో రూ.39.74 కోట్లు జమ చేసింది. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకంలో భాగంగా ఇప్పటివరకు మొత్తం 83,420 మంది ఉపాధి కూలీలకు రూ.50.65 కోట్లు చెల్లించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఎన్నికల కోడ్ ముగియగానే లబ్ధిదారులందరికీ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నిధులను చెల్లించనున్న ప్రభుత్వం స్పష్టం చేసింది. రెక్కల కష్టాన్ని నమ్ముకున్న ఉపాధి కూలీలకు పెద్దదిక్కుగా నిలుస్తుందని ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.
ఆ కూలీలకూ 'ఇందిరమ్మ ఆత్మీయ భరోసా' అందించండి : హైకోర్టు
తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు జారీ - మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి