సంగారెడ్డి జిల్లా ఖానాపుర్లో కరోనా సోకిన బాధితులకు అవస్థలు తప్పడం లేదు. వారికి గ్రామంలో ఐసోలేషన్లో ఉండేందుకు స్థలం లేకపోవడం వల్ల ఇటీవల నిర్మించిన వైకుంఠధామంలో ఉంటున్నారు.
స్థానికంగా కరోనా సోకిన ముగ్గుర బాధితులకు ప్రభుత్వ పరంగా ఇసోలేషన్ చేసే సదుపాయం లేదు. నియోజకవర్గ పరిధిలో కేసులు పెరుగుతున్న తరుణంలో ప్రభుత్వం ఆ వ్యక్తులను ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ఇదిలా ఉంటె బాధితులు వైకుంఠ ధామంలో ఉండటం పరిసర తండా వాసులు వ్యతిరేకిస్తున్నారు. అయితే మానవత్వానికి మచ్చ తెచ్చే ఈ చర్యలు అందరిని కంట తడి పెట్టిస్తున్నాయి.
వారికి గ్రామంలో ప్రవేశం లేకపోవడం, ప్రభుత్వ పరంగా వసతులు లేకపోవడంతో అక్కడ ఉంటున్నారు. అక్కడ వారికి ఎలాంటి పీపీఈ కిట్లు కూడా అందుబాటులో లేవు. ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి సోకిన బాధితులను ప్రభుత్వం పాటించుకోకుండా వదిలేసింది. అంతే కాదు ఈ గ్రామం నారాయణ ఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి స్వగ్రామం కావడం కూడా మరో విశేషం.
ఇదీ చూడండి: అయోధ్య శోభాయమానం- భూమిపూజకు ముస్తాబు