ETV Bharat / state

దశలవారీ పోరాటాలకు సిద్ధంగా ఉండండి: అశ్వత్థామ రెడ్డి - tmu

ఆర్టీసీపై ప్రభుత్వ తీరుకు నిరసనగా కార్మికులు ఛలో ఆర్​ఎం కార్యాలయం పేరుతో ర్యాలీ నిర్వహించారు. టీఎంయూ ప్రధాన కార్యదర్శి అశ్వత్థామ రెడ్డి  పాల్గొన్నారు.

దశలవారీ పోరాటాలకు సిద్ధంగా ఉండండి: అశ్వత్థామ రెడ్డి
author img

By

Published : Aug 28, 2019, 5:10 PM IST

ఆర్టీసీ కార్మికులను రాష్ట్ర ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని టీఎంయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అశ్వత్థామ రెడ్డి అన్నారు. సంగారెడ్డి జిల్లాలో నిర్వహించిన 'ఛలో ఆర్​ఎం కార్యాలయం' కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఆర్టీసీ డిపో నుంచి ఆర్​ఎం కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వేతన సవరణ చేయాలని, కొత్త బస్సులు కొనుగోలు చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్​ చేశారు. సమస్య పరిష్కారంపై ప్రభుత్వానికి ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చినా స్పందనలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దశల వారీగా పోరాటాలు చేసేందుకు కార్మికులు సిద్ధంగా ఉండాలని సూచించారు.

దశలవారీ పోరాటాలకు సిద్ధంగా ఉండండి: అశ్వత్థామ రెడ్డి

ఇవీ చూడండి: "తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపాలి"

ఆర్టీసీ కార్మికులను రాష్ట్ర ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని టీఎంయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అశ్వత్థామ రెడ్డి అన్నారు. సంగారెడ్డి జిల్లాలో నిర్వహించిన 'ఛలో ఆర్​ఎం కార్యాలయం' కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఆర్టీసీ డిపో నుంచి ఆర్​ఎం కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వేతన సవరణ చేయాలని, కొత్త బస్సులు కొనుగోలు చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్​ చేశారు. సమస్య పరిష్కారంపై ప్రభుత్వానికి ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చినా స్పందనలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దశల వారీగా పోరాటాలు చేసేందుకు కార్మికులు సిద్ధంగా ఉండాలని సూచించారు.

దశలవారీ పోరాటాలకు సిద్ధంగా ఉండండి: అశ్వత్థామ రెడ్డి

ఇవీ చూడండి: "తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపాలి"

Intro:TG_SRD_57_28_RTC_CHALO_RM_OFFICE_AB_TS10057
రిపోర్టర్: భాస్కర్ రెడ్డి, సంగారెడ్డి
( ) రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులను చిన్నచూపు చూస్తుందని.. కార్మికులు భవిష్యత్ లో ఎలాంటి త్యాగాలకైనా సిద్ధంగా ఉండాలని టీఎంయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అశ్వద్ధామ రెడ్డి పిలుపునిచ్చారు. టీఎంయూ రాష్ట్ర కమిటీ "ఛలో ఆర్ఎం కార్యాలయం" పిలుపునివ్వడంతో మెదక్ రీజియన్ లోని కార్మికులు పెద్ద ఎత్తున సంగారెడ్డికి తరలివచ్చారు. ఆర్టీసీ డిపో నుంచి ఆర్ఎం కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. దారిపొడవునా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ముందుకు సాగారు. యాజమాన్యం కార్మికులకు న్యాయపరంగా రావాల్సిన బకాయిలను చెల్లించడం లేదని.. ఆర్టీసీ ని వెంటనే ప్రభుత్వం లో విలీనం చేయాలని అశ్వద్ధామ రెడ్డి డిమాండ్ చేశారు. అదేవిధంగా కార్మికులకు ఉద్యోగ భద్రత, వేతన సవరణ, కొత్త బస్సులు లాంటి సౌకర్యాలను కల్పించాలన్నారు. ఆర్ టి సి కార్మికుల సమస్యలపై ప్రభుత్వానికి ఎన్ని సార్లు నోటీసులు ఇచ్చిన ఉలుకు పలుకు లేదన్నారు. ప్రభుత్వంతో పోరాడటానికి కార్మికులు సిద్ధంగా ఉండాలని.. ఇప్పటి నుంచి దశల వారిగా పోరాటాలు చేస్తామని స్పష్టం చేశారు.


Body:బైట్: అశ్వద్ధామ రెడ్డి, టీఎంయూ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి


Conclusion:విసువల్, బైట్
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.