పాఠశాలకు వెళ్లిన బాలుడు రెండు రోజులైనా తిరిగి రాకపోవడంతో పీఎస్లో తల్లి ఫిర్యాదు చేసింది. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం పోచారం గ్రామానికి చెందిన పదో తరగతి విద్యార్థి నీలేష్ మందిర్ హై స్కూల్లో పదో తరగతి చదువుతున్నాడు. ఈ నెల 27న పాఠశాలకు వెళ్లి... సాయంత్రం ఇంటికి తిరిగి రాకపోవడంతో తల్లి పాఠశాలకు వెళ్లి విచారించింది. నీలేష్ పాఠశాలకు రాలేదని ఉపాధ్యాయులు తెలిపారు.
చాలా చోట్ల తన కుమారుడి ఆచూకీ కోసం గాలించింది. ఫలితం లేకపోవడంతో పటాన్చెరు ఠాణాలో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చూడండి: పెళ్లికి వెళ్లి వచ్చేసరికే ఇంటిని దోచేశారు!