ETV Bharat / state

కుటుంబ కలహాలతో భార్య గొంతుకోసిన కిరాతకుడు - latest news of husband murder his wife in sanareddy

పొలానికి వెళ్లివస్తూ మాట్లాడుకుంటున్నారు.. మాటామాట పెరిగింది.. పొట్లాటకు దారితీసింది.. అంతే చేతిలో ఉన్న కత్తితో అమాంతం భార్య గొంతుకోసి కిరాతకంగా హతమార్చాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది.

a-husband-murder-his-wife-in-sangareddy-jaheerabad
కుటుంబ కలహాలతో భార్య గొంతుకోసిన కిరాతకుడు
author img

By

Published : Jun 17, 2020, 1:00 PM IST

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్​ మండలం ఖాసింపూర్​ గ్రామంలో దారుణం జరిగింది. కుటుంబ కలహాల నేపథ్యంలో పొలం పనులకు వెళ్లివస్తూ భార్య పుణ్యవతి, భర్త శంకర్​లు కుటుంబ విషయాలు మాట్లాడుకున్నారు. మాటామాటా పెరిగి కోపోద్రేకుడైన శంకర్ చేతిలో ఉన్న కత్తితో​ పుణ్యవతిని కిరాతంగా గొంతుకోసి చంపేశాడు.

గతంలో కుటుంబంలోని మనస్పర్థల కారణంగా పుణ్యవతి ఎనిమిది నెలలపాటు పుట్టింట్లో ఉందని.. పెద్దలు రాజీ కుదర్చగా ఐదు రోజుల క్రితమే భర్త వద్దకు వచ్చిందని స్థానికులు తెలిపారు. ఘటనా స్థలాన్ని జహీరాబాద్ సీఐ సైదేశ్వర్ పరిశీలించి మృతదేహాన్ని సమీప ఆస్పత్రికి తరలించారు. హత్యకు పాల్పడ్డ మృతురాలి భర్త శంకర్​ను అదుపులో తీసుకున్నారు.

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్​ మండలం ఖాసింపూర్​ గ్రామంలో దారుణం జరిగింది. కుటుంబ కలహాల నేపథ్యంలో పొలం పనులకు వెళ్లివస్తూ భార్య పుణ్యవతి, భర్త శంకర్​లు కుటుంబ విషయాలు మాట్లాడుకున్నారు. మాటామాటా పెరిగి కోపోద్రేకుడైన శంకర్ చేతిలో ఉన్న కత్తితో​ పుణ్యవతిని కిరాతంగా గొంతుకోసి చంపేశాడు.

గతంలో కుటుంబంలోని మనస్పర్థల కారణంగా పుణ్యవతి ఎనిమిది నెలలపాటు పుట్టింట్లో ఉందని.. పెద్దలు రాజీ కుదర్చగా ఐదు రోజుల క్రితమే భర్త వద్దకు వచ్చిందని స్థానికులు తెలిపారు. ఘటనా స్థలాన్ని జహీరాబాద్ సీఐ సైదేశ్వర్ పరిశీలించి మృతదేహాన్ని సమీప ఆస్పత్రికి తరలించారు. హత్యకు పాల్పడ్డ మృతురాలి భర్త శంకర్​ను అదుపులో తీసుకున్నారు.

ఇదీ చదవండి: హస్తకళాకారులకు కరోనా కష్టం

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.