Woman Died After Clash With Son In Shadnagar : రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో ఓ విషాద ఘటన చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ ప్రతాప్ లింగం తెలిపిన వివరాల ప్రకారం షాద్నగర్లో కేశంపేట రోడ్లో సుగుణ(42) తన కుమారుడితో నివాసం ఉంటోంది. సుగుణ మద్యానికి బానిసై రోజంతా తాగుతూ ఉండడంతో తల్లి, కుమారుడి మధ్య తరచూ వాగ్వాదం జరుగుతోంది.
ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం 9 గంటల సమయంలో కల్లు తాగడానికి రూ. 20 ఇవ్వాలంటూ సుగుణ, తన కుమారుడు శివతో గొడవ పడింది. శివ డబ్బులు ఇవ్వకపోవడంతో ఆమె అతనిపై చేయి చేసుకుంది. కోపోద్రిక్తుడైన శివ సైతం తల్లిపై చేయి చేసుకున్నాడు. చుట్టుపక్కల ఉన్నవారు వచ్చి ఇద్దరికి సర్దిచెప్పారు. అనంతరం శివ బయటకి వెళ్లిపోయాడు. సాయంత్రం ఏడు గంటల సమయంలో ఇంటికి రాగా, గేటు ముందు తల్లి మత్తులో పడి ఉంది.
Clash between mother and son : రాత్రి తన కూతురుకి ఫోన్ చేసి రమ్మని చెప్పంది. ఆమె ఇంటికి వచ్చి తల్లికి, సోదరుడికి నచ్చచెప్పి వెళ్లిపోయింది. మరుసటి రోజు సోమవారం ఉదయం 8 గంటల సమయంలో శివ తన తల్లిని నిద్రలేపేందుకు ప్రయత్నించగా, ఆమె లేవకపోవడంతో పొరుగింటి వాళ్లను పిలిచాడు. సుగుణ మృతి చెందిందని విషయం తెలియగానే స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.