రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలో సౌమ్య అనే విద్యార్థిని ఈసీఈ మూడో సంవత్సరం చదువుతోంది. రాత్రి అనుమానాస్పద స్థితిలో హాస్టల్ మూడో అంతస్తుపై నుంచి కింద పడింది. సౌమ్యను కళాశాల యాజమాన్యం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అనుకోకుండా పడిపోయిందా... లేక ఆమే కిందకు దూకిందా అనే కోణంలో పోలీసులు కేసు విచారిస్తున్నారు.
ఇదీ చూడండి: లండన్ నుంచి వచ్చాడు... అదృశ్యమయ్యాడు