ETV Bharat / state

'రూ. 100 కోట్ల వ్యయంతో ఓఆర్​ఆర్​ ఆధునీకరణ'

author img

By

Published : Jan 26, 2021, 3:47 PM IST

అమీర్​పేట్​ హెచ్ఎండీఏ ప్రధాన కార్యాలయంలో హెచ్ఎండీఏ సెక్రెటరీ సంతోష్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అభివృద్ధిలో హెచ్​ఎండీఏ ముందంజలో ఉందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. నగరం నలుమూలలా జరుగుతున్న పలు అభివృద్ధి పనుల వివరాలను సంతోష్​ వెల్లడించారు.

republic day celebrations, hmda office
గణతంత్ర దినోత్సవ వేడుకలు, హెచ్ఎండీఏ

అభివృద్ధిలో హైదరాబాద్​ మెట్రోపాలిటన్ డెవలప్​మెంట్ అథారిటీ ముందంజలో ఉందని హెచ్ఎండీఏ సెక్రెటరీ, హైదరాబాద్ గ్రోత్​కారిడార్ లిమిటెడ్ ​ఎండీ సంతోష్ పేర్కొన్నారు. అమీర్​పేట్​ హెచ్ఎండీఏ ప్రధాన కార్యాలయంలో ఆయన.. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. నగరానికి మణిహారంగా ఉన్న 158 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్డును మరింతగా ఆధునీకరించేందుకు రూ. 100 కోట్ల వ్యయంతో ఓఆర్ఆర్​ లైటింగ్ ప్రాజెక్టు పనులు నిర్వహిస్తున్నట్లు సంతోష్ తెలిపారు. ఓఆర్ఆర్​పై మరో రెండు ఇంటర్​ఛేంజ్​ నిర్మాణ పనులు ఈ ఏడాదిలో చేపడతామని వివరించారు. ప్రస్తుతం ఉన్న 19 ఇంటర్​ఛేంజ్​లలో సుందరీకరణ పనులు జరుగుతున్నాయని వెల్లడించారు.

కోకాపేట్​​ వద్ద వరల్డ్​ క్లాస్ లే అవుట్​ ప్రతిపాదనలు రూపుదిద్దుకుంటున్నాయని తెలిపిన ఆయన.. ఇప్పటికే మంగళ్​పల్లి లాజిస్టిక్ పార్కు వినియోగంలోకి వచ్చిందని పేర్కొన్నారు. త్వరలో బాటసింగారం లాజిస్టిక్​ పార్కు ప్రారంభమవుతుందని... అర్బన్​ ఫారెస్ట్రీ ఆధ్వర్యంలో 16 బ్లాకులు కూడా ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. ట్యాంక్​బండ్ బ్యూటిఫికేషన్, నెక్లెస్ రోడ్ ​వీడీసీసీ రోడ్డు​ పనులు పూర్తి కావొస్తున్నాయని వివరించారు. ఉప్పల్​, మెహదీపట్నం వద్ద స్కైవే పనులు జరుగుతున్నాయని కొద్ది నెలల్లోనే ఈ రెండు స్కైవేలు ప్రజలకు అందుబాటులోకి వస్తాయని సతీష్​ చెప్పారు.

అభివృద్ధిలో హైదరాబాద్​ మెట్రోపాలిటన్ డెవలప్​మెంట్ అథారిటీ ముందంజలో ఉందని హెచ్ఎండీఏ సెక్రెటరీ, హైదరాబాద్ గ్రోత్​కారిడార్ లిమిటెడ్ ​ఎండీ సంతోష్ పేర్కొన్నారు. అమీర్​పేట్​ హెచ్ఎండీఏ ప్రధాన కార్యాలయంలో ఆయన.. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. నగరానికి మణిహారంగా ఉన్న 158 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్డును మరింతగా ఆధునీకరించేందుకు రూ. 100 కోట్ల వ్యయంతో ఓఆర్ఆర్​ లైటింగ్ ప్రాజెక్టు పనులు నిర్వహిస్తున్నట్లు సంతోష్ తెలిపారు. ఓఆర్ఆర్​పై మరో రెండు ఇంటర్​ఛేంజ్​ నిర్మాణ పనులు ఈ ఏడాదిలో చేపడతామని వివరించారు. ప్రస్తుతం ఉన్న 19 ఇంటర్​ఛేంజ్​లలో సుందరీకరణ పనులు జరుగుతున్నాయని వెల్లడించారు.

కోకాపేట్​​ వద్ద వరల్డ్​ క్లాస్ లే అవుట్​ ప్రతిపాదనలు రూపుదిద్దుకుంటున్నాయని తెలిపిన ఆయన.. ఇప్పటికే మంగళ్​పల్లి లాజిస్టిక్ పార్కు వినియోగంలోకి వచ్చిందని పేర్కొన్నారు. త్వరలో బాటసింగారం లాజిస్టిక్​ పార్కు ప్రారంభమవుతుందని... అర్బన్​ ఫారెస్ట్రీ ఆధ్వర్యంలో 16 బ్లాకులు కూడా ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. ట్యాంక్​బండ్ బ్యూటిఫికేషన్, నెక్లెస్ రోడ్ ​వీడీసీసీ రోడ్డు​ పనులు పూర్తి కావొస్తున్నాయని వివరించారు. ఉప్పల్​, మెహదీపట్నం వద్ద స్కైవే పనులు జరుగుతున్నాయని కొద్ది నెలల్లోనే ఈ రెండు స్కైవేలు ప్రజలకు అందుబాటులోకి వస్తాయని సతీష్​ చెప్పారు.

ఇదీ చదవండి: కర్నల్​ సంతోష్​కుమార్​ భార్యకు కలెక్టరేట్​లో సన్మానం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.