రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం పోరండ్ల గ్రామానికి చెందిన గిద్దెల యాదమ్మకు.. కందుకూరు మండలం చిప్పేలపల్లిలో 14 ఎకరాల 11 గుంటల వ్యవసాయ భూమి ఉంది. దానిని కొందరు వ్యక్తులు ఆక్రమించుకున్నారని కమిషన్ ముందు ఆవేదన వ్యక్తం చేసింది. మహేశ్వరం తహసీల్దార్, అక్కడ పనిచేసే గుమస్తా శేఖర్, పలువురు అధికారులు కుమ్మక్కైయ్యారని తెలిపింది. బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది.
ఇదే విషయమై మహేశ్వరం పోలీసులకు ఫిర్యాదుచేసినా పట్టించుకోలేదని కమిషన్ దృష్టికి తీసుకువచ్చింది. తనకు రక్షణ కల్పించాలని.. తన భూమిని తనకు ఇప్పించాలని కోరింది.
ఇవీచూడండి: 'ద.మ. రైల్వేలో మహిళా ఉద్యోగులది కీలకపాత్ర'