మియాపూర్ ధర్మపురి ప్రాంతంలో ఆటోడ్రైవర్ను అత్యంత పాశవికంగా హతమార్చారు. తల, మొండెం వేరు చేశారు నిందితులు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
పథకం ప్రకారమే ప్రవీణ్ను హతమార్చినట్లు పోలీసులు గుర్తించారు. పాత కక్షలే కారణమని ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ప్రవీణ్ స్నేహితులు శ్రీకాంత్, శ్రీనివాస్లే హత్య చేసినట్లు ఆధారాలు సేకరించారు.
ప్రత్యేక బృందాలు
శ్రీకాంత్కు మరో వ్యక్తితో ఏర్పడిన విభేదాలపై ప్రవీణ్ వారికి నచ్చచెప్పాడు. ప్రవీణ్ ద్వారా తనను హత్యచేసేందుకు సదరు వ్యక్తులు ప్రయత్నిస్తున్నారని భావించిన శ్రీకాంత్.. తన బావమరిదితో కలిసి హత్యకు పథకం రచించాడు. ధర్మపురిలోని నిర్మానుష్య ప్రాంతానికి రప్పించి పాశవికంగా హతమార్చినట్లు పోలీసులు తెలిపారు.
ఈ కేసులో ఇతరుల ప్రమేయంపైనా ఆరా తీస్తున్నామన్న పోలీసులు.. నిందితుల గాలింపు కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు.
ఇవీ చూడండి: సోదరుడి భార్య, కుమారుడిపై గొడ్డలితో దాడి