ETV Bharat / state

తప్పిపోయారనుకున్న పిల్లలు దొరికిపోయారు - telangana crime news

ఆడుకుంటున్న పిల్లలు ఆకస్మాత్తుగా కనిపించకుండా పోయారు. గమనించిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ఆ పరిధిలో సీసీ కెమెరాలను పరిశీలించారు. శంకర్​నగర్ సీసీ పుటేజ్​లో పిల్లలు ఆడుకున్నట్లు కనిపించింది.

Missing children were found at chanda nagar
తప్పిపోయారనుకున్న పిల్లలు దొరికిపోయారు
author img

By

Published : Feb 18, 2021, 10:04 PM IST

మధ్యప్రదేశ్​కు చెందిన వీకే సూరజ్ ఇద్దరు కుమార్తెలతోపాటు మరో పాప ఒకేసారి అదృశ్యమవడంతో కలకలం రేగింది. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా అమీన్​పూర్​ వెంకటరమణ కాలనీలో జరిగింది.

సూరజ్ కుమార్తెలు రాణి(5), రాధిక(4) పక్క గుడిసెలో ఉంటున్న పింటూ(7) సహా కనిపించకుండా పోయారు. వారిని ఎవరో అపహరించారనే అనుమానంతో కుటుంబసభ్యులు పోలీసులకు తెలిపారు.

వారి కోసం కోసం పోలీసులు గాలించగా.. శంకర్​నగర్ సీసీ పుటేజ్​లో పిల్లలు రోడ్లపై ఆడుకుంటూ కనిపించారు. వారి వెంట ఎవరూ లేనట్లుగా గుర్తించారు. చివరకు ఆ పిల్లలు చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దొరికడంతో కథ సుఖాంతమైంది.

ఇదీ చూడండి : నిందితులు ఎవరైనా వదలిపెట్టం: ఐజీ

మధ్యప్రదేశ్​కు చెందిన వీకే సూరజ్ ఇద్దరు కుమార్తెలతోపాటు మరో పాప ఒకేసారి అదృశ్యమవడంతో కలకలం రేగింది. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా అమీన్​పూర్​ వెంకటరమణ కాలనీలో జరిగింది.

సూరజ్ కుమార్తెలు రాణి(5), రాధిక(4) పక్క గుడిసెలో ఉంటున్న పింటూ(7) సహా కనిపించకుండా పోయారు. వారిని ఎవరో అపహరించారనే అనుమానంతో కుటుంబసభ్యులు పోలీసులకు తెలిపారు.

వారి కోసం కోసం పోలీసులు గాలించగా.. శంకర్​నగర్ సీసీ పుటేజ్​లో పిల్లలు రోడ్లపై ఆడుకుంటూ కనిపించారు. వారి వెంట ఎవరూ లేనట్లుగా గుర్తించారు. చివరకు ఆ పిల్లలు చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దొరికడంతో కథ సుఖాంతమైంది.

ఇదీ చూడండి : నిందితులు ఎవరైనా వదలిపెట్టం: ఐజీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.