రంగారెడ్డి జిల్లా హయత్నగర్లోని వీరన్న గుట్ట ఆలయంలో శివరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. అనంతరం అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి పాల్పొన్నారు.
పురాతనమైన వీరన్నగుట్ట ఆలయాన్ని పుణ్య క్షేత్రంగా అభివృద్ధి చేస్తానని నరసింహారెడ్డి తెలిపారు. భక్తులకు ఇబ్బంది లేకుండా.. ఇప్పటికే ఆలయానికి ఇరువైపులా విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయించినట్లు చెప్పారు. వీరన్నగుట్టకు వచ్చే భక్తులందరూ స్వామివారి దర్శనం అనంతరం.. అన్నప్రసాదాలను స్వీకరించాలని కోరారు. భక్తులకు కాలనీవాసులు సహకరించాలని సూచించారు.
ఇదీచూడండి: శివోహం.. రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా మహాశివరాత్రి వేడుకలు...