పశుగ్రాసం తీసుకెళ్తున్న లారీ అగ్నికి ఆహుతైంది. రంగారెడ్డి జిల్లా నాదర్ గుల్ దగ్గర.. కందుకూరు మండలం జైత్వారం రహదారిలో ఈ ఘటన జరిగింది. లారీలో భారీగా గడ్డితో వెళ్తుండగా.. పైన ఉన్న కరెంట్ తీగలు తగిలి మంటలు అంటుకున్నాయి. ఎండ తీవ్రత, గాలి వేగంతో క్షణాల్లోనే... మంటలు వేగంగా వ్యాపించాయి. చూస్తుండగానే లారీ పూర్తిగా కాలిపోయింది. ప్రమాదం నుంచి డ్రైవర్, క్లీనర్ త్రుటిలో తప్పించుకున్నారు.
ఇవీ చూడండి: ఈ నెల 9న ఆర్మూర్లో రైతు ఐక్యత సభ