రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో విదేశాల నుంచి వచ్చిన 12 మందిని అధికారులు గృహనిర్బంధంలో ఉంచారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో చర్యలు తీసుకున్నట్లు అధికారులు వివరించారు. ఇతర దేశాల నుంచి వచ్చిన వారిని గుర్తించేందుకు ప్రత్యేకంగా రెండు బృందాలను వైద్యశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. గృహ నిర్బంధంలో ఉన్న ఇళ్లపై అధికారులు స్టిక్కర్లు అతికించారు.
ఇదీ చూడిండి: ప్రభుత్వం ప్రకటించిన లాక్డౌన్ మార్గదర్శకాలివే...