ETV Bharat / state

జల్​పల్లిలో ఎమ్మార్పీఎస్​ నాయకుల ధర్నా..

author img

By

Published : Aug 28, 2020, 7:07 AM IST

Updated : Aug 28, 2020, 2:55 PM IST

రంగారెడ్డి జిల్లా జల్​పల్లిలో పలువురు ఎమ్మార్పీఎస్​ నాయకులు ధర్నాకు దిగారు. గ్రామ సమీపంలో ప్రభుత్వం పేదలకు ఇచ్చిన స్థలం కబ్జాకు గురవుతుందని.. ఆ స్థలాన్ని అర్హులకు అందేలా చూడాలని డిమాండ్​ చేశారు.

Dharna of MRPS leaders in JalPalli
జల్​పల్లిలో ఎమ్మార్పీఎస్​ నాయకుల ధర్నా.. ఎందుకంటే?

రంగారెడ్డి జిల్లా జల్​పల్లి గ్రామ సమీపంలో ప్రభుత్వం పేదలకు ఇచ్చిన స్థలం కబ్జాకు గురవుతుందని ఆరోపిస్తూ పలువురు ఎమ్మార్పీఎస్​ నాయకులు ధర్నాకు దిగారు. స్థలాన్ని కబ్జా కాకుండా చూసి.. అర్హులకు అందేటట్లు చూడాలని డిమాండ్ చేశారు.

రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం జల్​పల్లి గ్రామంలోని సర్వే నెంబర్ 62లోని భూమిని ప్రభుత్వం పేదలకు ఇచ్చింది. అయితే ఈ భూమి పక్కవారు స్థలాన్ని కబ్జా చేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారని ఎమ్మార్పీఎస్​ నాయకులు ఆరోపించారు. ఈ విషయంపై కలెక్టర్, ఆర్డీవో, తహసీల్దార్​లకు ఫిర్యాదు చేశామని తెలిపారు. ప్రభుత్వ స్థలాన్ని కబ్జా కాకుండా చూసి అర్హులకు అందేటట్లు చూడాలని కోరారు.

సమాచారం అందుకున్న పహాడీషరీఫ్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ధర్నాలో స్థానిక నేత దానయ్య, ఎమ్మార్పీఎస్​ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆర్.బాబు, బి.రవి, శంకర్ రావు, రమేష్, రాము, ఇంద్ర, పలువురు స్థానికులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: బాలీవుడ్​కు 'డ్రగ్స్' మరక.. ​గుట్టు బయటపెడతానన్న కంగన

రంగారెడ్డి జిల్లా జల్​పల్లి గ్రామ సమీపంలో ప్రభుత్వం పేదలకు ఇచ్చిన స్థలం కబ్జాకు గురవుతుందని ఆరోపిస్తూ పలువురు ఎమ్మార్పీఎస్​ నాయకులు ధర్నాకు దిగారు. స్థలాన్ని కబ్జా కాకుండా చూసి.. అర్హులకు అందేటట్లు చూడాలని డిమాండ్ చేశారు.

రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం జల్​పల్లి గ్రామంలోని సర్వే నెంబర్ 62లోని భూమిని ప్రభుత్వం పేదలకు ఇచ్చింది. అయితే ఈ భూమి పక్కవారు స్థలాన్ని కబ్జా చేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారని ఎమ్మార్పీఎస్​ నాయకులు ఆరోపించారు. ఈ విషయంపై కలెక్టర్, ఆర్డీవో, తహసీల్దార్​లకు ఫిర్యాదు చేశామని తెలిపారు. ప్రభుత్వ స్థలాన్ని కబ్జా కాకుండా చూసి అర్హులకు అందేటట్లు చూడాలని కోరారు.

సమాచారం అందుకున్న పహాడీషరీఫ్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ధర్నాలో స్థానిక నేత దానయ్య, ఎమ్మార్పీఎస్​ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆర్.బాబు, బి.రవి, శంకర్ రావు, రమేష్, రాము, ఇంద్ర, పలువురు స్థానికులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: బాలీవుడ్​కు 'డ్రగ్స్' మరక.. ​గుట్టు బయటపెడతానన్న కంగన

Last Updated : Aug 28, 2020, 2:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.