ETV Bharat / state

నివేదికలు సిద్ధం చేయండి: సీఎస్​ సోమేశ్​ కుమార్​

author img

By

Published : Apr 3, 2021, 10:16 PM IST

రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల్లోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల సమగ్ర అభివృద్ధి, భవిష్యత్ అవసరాలను గుర్తించి నివేదికలు సిద్ధం చేయాలని అన్ని శాఖల అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆదేశించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు బీఆర్కే భవన్ నుంచి అన్ని శాఖల అధిపతులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.

cs somesh kumar
సీఎస్​ సోమేశ్​ కుమార్​

హైదరాబాద్​ బీఆర్కే భవన్ నుంచి అన్ని శాఖల అధిపతులతో సీఎస్ సోమేశ్​ కుమార్​ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల సమగ్ర అభివృద్ధిపై చర్చించారు. వాటి సమగ్ర అభివృద్ధి, భవిష్యత్ అవసరాలను గుర్తించి నివేదికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. తాగునీరు, మురుగునీరు, రోడ్లు, డంపింగ్ యార్డులు, ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్ వెజ్ మార్కెట్ల నిర్మాణం, ట్రాన్స్​ఫార్మర్ల పరంగా విద్యుత్ పరిస్థితి, సబ్ స్టేషన్లు, పోలీస్ స్టేషన్లు వంటి సౌకర్యాలపై దృష్టి పెట్టాలని సూచించారు.మౌళికవసతులపై నివేదిక రూపొందించాలన్నారు.

నాలాలు, చెరువులు, ఉద్యానవనాల అభివృద్ధి, వైకుంఠదామాల నిర్మాణం, బస్తీదవాఖానాల్లో మౌలికసదుపాయాల కల్పనపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలన్నారు. సమగ్ర అభివృద్ధి ప్రణాళిక అమలుకు అవసరమైన ప్రభుత్వ భూములు, భవనాలను గుర్తించాలని రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. నానాటికీ పెరుగుతున్న రద్దీని దృష్టిలో ఉంచుకొని కొత్త పోలీస్ స్టేషన్ల ఏర్పాటుకు ప్రణాళిక తయారుచేయాలని సైబారాబాద్​, రాచకొండ పోలీస్ కమిషనర్లకు సూచించారు.

అన్ని అంశాలపై సమగ్ర వివరాలు సేకరించిన అనంతరం మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, సంబంధిత అధికారులతో ముఖ్యమంత్రి సమావేశమవుతారని, వారితో చర్చించి తుది ప్రణాళిక రూపొందించనున్నట్లు సీఎస్ తెలిపారు.

cs somesh kumar
సీఎస్​ సోమేశ్​ కుమార్​

ఇదీ చదవండి: ఆ ఆస్పత్రుల్లో మళ్లీ కొవిడ్ సేవలు: ఈటల

హైదరాబాద్​ బీఆర్కే భవన్ నుంచి అన్ని శాఖల అధిపతులతో సీఎస్ సోమేశ్​ కుమార్​ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల సమగ్ర అభివృద్ధిపై చర్చించారు. వాటి సమగ్ర అభివృద్ధి, భవిష్యత్ అవసరాలను గుర్తించి నివేదికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. తాగునీరు, మురుగునీరు, రోడ్లు, డంపింగ్ యార్డులు, ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్ వెజ్ మార్కెట్ల నిర్మాణం, ట్రాన్స్​ఫార్మర్ల పరంగా విద్యుత్ పరిస్థితి, సబ్ స్టేషన్లు, పోలీస్ స్టేషన్లు వంటి సౌకర్యాలపై దృష్టి పెట్టాలని సూచించారు.మౌళికవసతులపై నివేదిక రూపొందించాలన్నారు.

నాలాలు, చెరువులు, ఉద్యానవనాల అభివృద్ధి, వైకుంఠదామాల నిర్మాణం, బస్తీదవాఖానాల్లో మౌలికసదుపాయాల కల్పనపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలన్నారు. సమగ్ర అభివృద్ధి ప్రణాళిక అమలుకు అవసరమైన ప్రభుత్వ భూములు, భవనాలను గుర్తించాలని రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. నానాటికీ పెరుగుతున్న రద్దీని దృష్టిలో ఉంచుకొని కొత్త పోలీస్ స్టేషన్ల ఏర్పాటుకు ప్రణాళిక తయారుచేయాలని సైబారాబాద్​, రాచకొండ పోలీస్ కమిషనర్లకు సూచించారు.

అన్ని అంశాలపై సమగ్ర వివరాలు సేకరించిన అనంతరం మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, సంబంధిత అధికారులతో ముఖ్యమంత్రి సమావేశమవుతారని, వారితో చర్చించి తుది ప్రణాళిక రూపొందించనున్నట్లు సీఎస్ తెలిపారు.

cs somesh kumar
సీఎస్​ సోమేశ్​ కుమార్​

ఇదీ చదవండి: ఆ ఆస్పత్రుల్లో మళ్లీ కొవిడ్ సేవలు: ఈటల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.