ETV Bharat / state

తొలిరోజు ముప్పై మంది వైద్య సిబ్బందికి టీకా: కలెక్టర్

author img

By

Published : Jan 16, 2021, 4:15 PM IST

హైదరాబాద్​లోని వనస్థలిపురం ఏరియా ఆస్పత్రిలో కరోనా వ్యాక్సిన్​ పంపిణీ కార్యక్రమాన్ని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ హరీశ్​ ప్రారంభించారు. తొలిరోజు 30 మంది వైద్య సిబ్బందికి టీకా వేస్తున్నట్లు ఆయన తెలిపారు. అనంతరం వారిని గంటసేపు వైద్యుల పర్యవేక్షణలో ఉంచామన్నారు.

covid vaccine distribution in vanasthalipuram area hospital
కొవిడ్ వ్యాక్సిన్​ తీసుకున్న వైద్యసిబ్బంది

వనస్థలిపురం ఏరియా ఆస్పత్రిలో మొదటి రోజు 30 మంది వైద్య సిబ్బందికి కొవిడ్ వ్యాక్సిన్​ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని రంగారెడ్డి జిల్లా పాలనాధికారి హరీశ్​ ప్రారంభించారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం వారంలో నాలుగు రోజులు వైద్యసిబ్బందికి కరోనా టీకా ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు.

వ్యాక్సిన్ ఇచ్చిన అనంతరం వారిని గంటసేపు వైద్యుల పర్యవేక్షణలో ఉంచామన్నారు. ఈ కార్యక్రమంలో హయత్​నగర్​ తహసీల్దార్​ శైలజ, స్థానిక కార్పొరేటర్​ ముద్దగోని లక్ష్మీప్రసన్న, వైద్యాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

ఇదీ చూడండి : కొవిడ్ వ్యాక్సిన్​తో మహమ్మారి నుంచి విముక్తి : మంత్రి వేముల

వనస్థలిపురం ఏరియా ఆస్పత్రిలో మొదటి రోజు 30 మంది వైద్య సిబ్బందికి కొవిడ్ వ్యాక్సిన్​ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని రంగారెడ్డి జిల్లా పాలనాధికారి హరీశ్​ ప్రారంభించారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం వారంలో నాలుగు రోజులు వైద్యసిబ్బందికి కరోనా టీకా ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు.

వ్యాక్సిన్ ఇచ్చిన అనంతరం వారిని గంటసేపు వైద్యుల పర్యవేక్షణలో ఉంచామన్నారు. ఈ కార్యక్రమంలో హయత్​నగర్​ తహసీల్దార్​ శైలజ, స్థానిక కార్పొరేటర్​ ముద్దగోని లక్ష్మీప్రసన్న, వైద్యాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

ఇదీ చూడండి : కొవిడ్ వ్యాక్సిన్​తో మహమ్మారి నుంచి విముక్తి : మంత్రి వేముల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.