ETV Bharat / state

పోలీసులపై పంజా విసిరిన కరోనా... గ్రేటర్ పరిధిలో 72 మందికి పాజిటివ్

author img

By

Published : Jan 18, 2022, 11:28 AM IST

Updated : Jan 18, 2022, 5:12 PM IST

Narsing police station
పోలీసులకు కరోనా

11:25 January 18

హోం ఐసోలేషన్‌లో పోలీసులు

రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. పోలీస్​ శాఖను కూడా వైరస్ వదలట్లేదు. 24 గంటలు శాంతిభద్రతల కోసం శ్రమించే వీరంతా ఇప్పుడు కొవిడ్ బారిన పడుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 72మంది కొవిడ్ బాధితులయ్యారు.

తాజాగా రంగారెడ్డి జిల్లాలోని హయత్ నగర్​ పోలీస్​ స్టేషన్​లో సీఐతో పాటు 14 మంది కానిస్టేబుళ్లకు పాజిటివ్​గా తేలింది. అటు నార్సింగ్​ పోలీస్​ స్టేషన్​లో 20 మంది పోలీసులకు కరోనా సోకింది. ప్రస్తుతం అందరూ హోం ఐసోలేషన్​లో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. పోలీసులకు కరోనా సోకడంతో స్టేషన్​ వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఫిర్యాదు దారుల కోసం పీఎస్​ల​ ఎదుట ప్రత్యేక టెంట్ వేశారు.

సైబర్​ క్రైమ్​లో వైరస్ అలజడి..

హైదరాబాద్ సీసీఎస్‌, సైబర్ క్రైమ్‌లో పనిచేస్తున్న 20 మంది పోలీస్ సిబ్బందికి కరోనా సోకింది. ఇటీవల సైబర్ క్రైమ్ టీమ్ ఓ కేసు విషయంలో రాజస్థాన్​కి వెళ్లి వచ్చారు. ఆ టీమ్​లోని ఎస్సైకి కరోనా పాజిటివ్ వచ్చింది. ఎస్సై నుంచి అందరికీ సోకినట్లు అనుమానిస్తున్నారు. పాజిటివ్ వచ్చిన 20 మంది పోలీసు సిబ్బంది హోం ఐసోలేషన్​లో చికిత్స పొందుతున్నారు.

ఇదిలా ఉండగా.. చైతన్యపురి పీఎస్​లో 8 మంది కానిస్టేబుళ్లు, వనస్థలిపురంలో ఒకరు, అబ్దుల్లాపూర్​మెట్​లో ఒకరికి కరోనా సోకింది. అల్వాల్​ పోలీస్​స్టేషన్​లో నలుగురు సిబ్బంది కొవిడ్​ బారిన పడినట్లు అధికారులు తెలిపారు. ప్రజలంతా మాస్కులు ధరించి.. కొవిడ్​ నిబంధనలు పాటించాలని పోలీసులు సూచిస్తున్నారు.

ఇదీ చూడండి: రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా ఉద్ధృతి.. కొత్తగా 2,447 కేసులు..

11:25 January 18

హోం ఐసోలేషన్‌లో పోలీసులు

రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. పోలీస్​ శాఖను కూడా వైరస్ వదలట్లేదు. 24 గంటలు శాంతిభద్రతల కోసం శ్రమించే వీరంతా ఇప్పుడు కొవిడ్ బారిన పడుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 72మంది కొవిడ్ బాధితులయ్యారు.

తాజాగా రంగారెడ్డి జిల్లాలోని హయత్ నగర్​ పోలీస్​ స్టేషన్​లో సీఐతో పాటు 14 మంది కానిస్టేబుళ్లకు పాజిటివ్​గా తేలింది. అటు నార్సింగ్​ పోలీస్​ స్టేషన్​లో 20 మంది పోలీసులకు కరోనా సోకింది. ప్రస్తుతం అందరూ హోం ఐసోలేషన్​లో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. పోలీసులకు కరోనా సోకడంతో స్టేషన్​ వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఫిర్యాదు దారుల కోసం పీఎస్​ల​ ఎదుట ప్రత్యేక టెంట్ వేశారు.

సైబర్​ క్రైమ్​లో వైరస్ అలజడి..

హైదరాబాద్ సీసీఎస్‌, సైబర్ క్రైమ్‌లో పనిచేస్తున్న 20 మంది పోలీస్ సిబ్బందికి కరోనా సోకింది. ఇటీవల సైబర్ క్రైమ్ టీమ్ ఓ కేసు విషయంలో రాజస్థాన్​కి వెళ్లి వచ్చారు. ఆ టీమ్​లోని ఎస్సైకి కరోనా పాజిటివ్ వచ్చింది. ఎస్సై నుంచి అందరికీ సోకినట్లు అనుమానిస్తున్నారు. పాజిటివ్ వచ్చిన 20 మంది పోలీసు సిబ్బంది హోం ఐసోలేషన్​లో చికిత్స పొందుతున్నారు.

ఇదిలా ఉండగా.. చైతన్యపురి పీఎస్​లో 8 మంది కానిస్టేబుళ్లు, వనస్థలిపురంలో ఒకరు, అబ్దుల్లాపూర్​మెట్​లో ఒకరికి కరోనా సోకింది. అల్వాల్​ పోలీస్​స్టేషన్​లో నలుగురు సిబ్బంది కొవిడ్​ బారిన పడినట్లు అధికారులు తెలిపారు. ప్రజలంతా మాస్కులు ధరించి.. కొవిడ్​ నిబంధనలు పాటించాలని పోలీసులు సూచిస్తున్నారు.

ఇదీ చూడండి: రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా ఉద్ధృతి.. కొత్తగా 2,447 కేసులు..

Last Updated : Jan 18, 2022, 5:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.