ETV Bharat / state

BJP DEMAND: జీవో నంబర్ 46ను వెంటనే అమలు చేయాలి: భాజపా

ప్రైవేటు పాఠశాలల్లో అధిక ఫీజు వసూళ్లను ప్రభుత్వం అరికట్టాలని భాజపా రాష్ట్ర నాయకులు కళ్లెం రవీందర్, సామ రంగారెడ్డి కోరారు. జీవో నంబర్ 46ను వెంటనే అమలు చేయాలని కోరుతూ.. రంగారెడ్డి జిల్లా హయత్​ నగర్​లోని ఎంఈవో కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు.

author img

By

Published : Jun 26, 2021, 8:18 PM IST

BJP leaders concern that higher fees in corporate schools would not be reduced
కార్పొరేట్ పాఠశాలల్లో అధిక ఫీజులు తగ్గించాలని భాజపా నేతల ధర్నా

కార్పొరేట్ పాఠశాలల్లో అధిక ఫీజు వసూళ్లను అరికట్టాలని భాజపా రాష్ట్ర నాయకులు కళ్లెం రవీందర్ అన్నారు. జీవో నంబర్ 46ను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ.. రంగారెడ్డి జిల్లా హయత్​ నగర్​లోని ఎం​ఈవో కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు.

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలను ప్రైవేట్ పాఠశాలలు పట్టించుకోవడం లేదని రంగారెడ్డి జిల్లా అర్బన్ భాజపా అధ్యక్షులు సామ రంగారెడ్డి ఆరోపించారు. నెల రోజుల పాటు జరిగిన క్లాసులకు ఏడాది ఫీజు వసూలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. కార్పొరేట్​ పాఠశాలల దోపిడిని అరికట్టడానికి జీవో నంబర్​ 46ను పటిష్టంగా అమలు చేయాలని కోరుతూ.. ఎం​ఈవో ఈర్య నాయక్​కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక భాజపా కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

కార్పొరేట్ పాఠశాలల్లో అధిక ఫీజు వసూళ్లను అరికట్టాలని భాజపా రాష్ట్ర నాయకులు కళ్లెం రవీందర్ అన్నారు. జీవో నంబర్ 46ను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ.. రంగారెడ్డి జిల్లా హయత్​ నగర్​లోని ఎం​ఈవో కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు.

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలను ప్రైవేట్ పాఠశాలలు పట్టించుకోవడం లేదని రంగారెడ్డి జిల్లా అర్బన్ భాజపా అధ్యక్షులు సామ రంగారెడ్డి ఆరోపించారు. నెల రోజుల పాటు జరిగిన క్లాసులకు ఏడాది ఫీజు వసూలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. కార్పొరేట్​ పాఠశాలల దోపిడిని అరికట్టడానికి జీవో నంబర్​ 46ను పటిష్టంగా అమలు చేయాలని కోరుతూ.. ఎం​ఈవో ఈర్య నాయక్​కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక భాజపా కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: Bhatti Vikramarka: తెరాస ప్రభుత్వం ఎస్సీలను అణచివేస్తోంది: భట్టి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.