ETV Bharat / state

Eenadu effect: మూసీ నది పరివాహక ప్రాంతాన్ని పరిశీలించిన అధికారులు

author img

By

Published : Jun 22, 2021, 6:59 PM IST

రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని హైదర్​గూడలో గల మూసీ కాలువలో కొందరు భూ బకాసురులు రాత్రికి రాత్రి మట్టిపోసి మూసి వేస్తున్నారన్న సమాచారాన్ని ఈనాడు పత్రికలో చూసి మూసీ రివర్​ఫ్రంట్ అధికారులు స్పందించారు. ఈనాడు 'కళ్లు మూసీకున్నారా' అనే శీర్షికతో ప్రచురించిన కథనానికి స్పందించి మూసీ నది పరివాహక ప్రాంతాన్ని సందర్శించారు. కబ్జాదారులు ఎంతటి వారైనా చర్యలు తీసుకుంటామన్నారు.

మూసీ నది పరివాహక ప్రాంతాన్ని పరిశీలించిన అధికారులు
మూసీ నది పరివాహక ప్రాంతాన్ని పరిశీలించిన అధికారులు

ఈటీవీ, ఈనాడు కథనానికి ఇరిగేషన్, రెవెన్యూ, పోలీస్, మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్​మెంట్​ కార్పొరేషన్ అధికారులు స్పందించారు. రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని హైదర్​గూడలో గల మూసీ కాలువలో కొందరు భూ బకాసురులు రాత్రికి రాత్రి మట్టిపోసి మూసి వేస్తున్నారన్న సమాచారాన్ని ఈనాడు పత్రికలో చూసి మూసీ రివర్​ఫ్రంట్ అధికారులు సందర్శించారు. దాదాపు 100 కోట్ల విలువ చేసే మూసీకాలువ స్థలాన్ని పెద్ద పెద్ద బండరాళ్లు వేసి కబ్జాదారులు యథేచ్ఛగా కబ్జా చేస్తున్నారని ఈనాడు 'కళ్లు మూసీకున్నారా' అనే శీర్షికతో ప్రచురించింది.

ఈనాడు కథనాన్ని చూసిన మూసీ రివర్​ఫ్రంట్ డెవలప్​మెంట్​ కార్పొరేషన్​ చీఫ్​ ​ఇంజినీర్​ మోహన్​ నాయక్​ తమ సిబ్బందితో కలిసి మూసీ నది పరివాహక ప్రాంతాన్ని పరిశీలించారు. మూసీ నదిలో మట్టిపోసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. వెంటనే మూసీ నది నుంచి బండరాళ్లు, మట్టిని జేసీబీ సహాయంతో తొలగిస్తామని పేర్కొన్నారు. మూసీ నదిలో భూ కబ్జాలపై మంత్రి కేటీఆర్​కు ఫిర్యాదు చేస్తామని మోహన్ నాయక్ వెల్లడించారు. మూసీ రివర్, బఫర్ జోన్ అక్రమ నిర్మాణాలు గుర్తించి వాటిపై చర్యలు తీసుకుంటామని... బాధ్యులు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని ఆయన తెలిపారు.

ఇప్పటికైనా మూసీ కాలువపై అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరారు. కబ్జాదారులపై కఠినంగా చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అధికారులు, రాజేంద్రనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో మూసీ రివర్​ఫ్రంట్ డెవలప్​మెంట్​ కార్పొరేషన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ మాలతి, రాజేంద్రనగర్ ఎమ్మార్వో చంద్రశేఖర్ గౌడ్, డీఈఈ రాహుజ, ఈఈ బస్వరాజు, ఎస్​ఈ మల్లికార్జున్, ఆర్​ఐ, సర్వేయర్ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: 20ఎకరాల ప్రభుత్వ భూమిపై స్థిరాస్తి వ్యాపారుల కన్ను

ఈటీవీ, ఈనాడు కథనానికి ఇరిగేషన్, రెవెన్యూ, పోలీస్, మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్​మెంట్​ కార్పొరేషన్ అధికారులు స్పందించారు. రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని హైదర్​గూడలో గల మూసీ కాలువలో కొందరు భూ బకాసురులు రాత్రికి రాత్రి మట్టిపోసి మూసి వేస్తున్నారన్న సమాచారాన్ని ఈనాడు పత్రికలో చూసి మూసీ రివర్​ఫ్రంట్ అధికారులు సందర్శించారు. దాదాపు 100 కోట్ల విలువ చేసే మూసీకాలువ స్థలాన్ని పెద్ద పెద్ద బండరాళ్లు వేసి కబ్జాదారులు యథేచ్ఛగా కబ్జా చేస్తున్నారని ఈనాడు 'కళ్లు మూసీకున్నారా' అనే శీర్షికతో ప్రచురించింది.

ఈనాడు కథనాన్ని చూసిన మూసీ రివర్​ఫ్రంట్ డెవలప్​మెంట్​ కార్పొరేషన్​ చీఫ్​ ​ఇంజినీర్​ మోహన్​ నాయక్​ తమ సిబ్బందితో కలిసి మూసీ నది పరివాహక ప్రాంతాన్ని పరిశీలించారు. మూసీ నదిలో మట్టిపోసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. వెంటనే మూసీ నది నుంచి బండరాళ్లు, మట్టిని జేసీబీ సహాయంతో తొలగిస్తామని పేర్కొన్నారు. మూసీ నదిలో భూ కబ్జాలపై మంత్రి కేటీఆర్​కు ఫిర్యాదు చేస్తామని మోహన్ నాయక్ వెల్లడించారు. మూసీ రివర్, బఫర్ జోన్ అక్రమ నిర్మాణాలు గుర్తించి వాటిపై చర్యలు తీసుకుంటామని... బాధ్యులు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని ఆయన తెలిపారు.

ఇప్పటికైనా మూసీ కాలువపై అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరారు. కబ్జాదారులపై కఠినంగా చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అధికారులు, రాజేంద్రనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో మూసీ రివర్​ఫ్రంట్ డెవలప్​మెంట్​ కార్పొరేషన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ మాలతి, రాజేంద్రనగర్ ఎమ్మార్వో చంద్రశేఖర్ గౌడ్, డీఈఈ రాహుజ, ఈఈ బస్వరాజు, ఎస్​ఈ మల్లికార్జున్, ఆర్​ఐ, సర్వేయర్ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: 20ఎకరాల ప్రభుత్వ భూమిపై స్థిరాస్తి వ్యాపారుల కన్ను

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.