రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పెద్దలింగాపూర్లో పోచమ్మ బోనాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతీ ఇంట్లో నుంచి మహిళలు, యువతులు నెత్తిన బోనంతో అమ్మ వారి సన్నిధికి చేరుకున్నారు. బైండ్ల పూజారుల విన్యాసాలు, డప్పు చప్పుళ్ళతో గ్రామస్థులు ఊరేగింపుగా ఆలయానికి తరలివెళ్లి బోనాలు సమర్పించారు.
ఇవీ చూడండి : కాళీమాత సేవలో కేంద్రమంత్రి కిషన్రెడ్డి