ETV Bharat / state

పలు మండలాల్లో రైతు వేదికలను పరిశీలించిన కలెక్టర్‌ - కోనరావుపేట మండలం, చందుర్తి మండలం రైతు వేదికల వార్తలు

కోనరావుపేట, చందుర్తి మండలాల్లో ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న రైతు వేదికలను రాజన్న సిరిసిల్ల జిల్లా పాలనాధికారి కృష్ణ భాస్కర్, ఎస్పీ రాహుల్ సందర్శించారు. సిరిసిల్ల పట్టణంలో కార్పొరేట్ పాఠశాలలకు ఏమాత్రం తీసిపోకుండా నిర్మించిన ప్రభుత్వ పాఠశాలను పరిశీలించారు.

Rajanna Sircilla collector Krishna Bhaskar and SP Rahul visited rythu vedika in Konaraopeta and Chandurti mandals
పలు మండలాల్లో రైతు వేదికలను పరిశీలించిన కలెక్టర్‌
author img

By

Published : Jan 31, 2021, 6:16 PM IST

రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల కేంద్రంలో, చందుర్తి మండలంలోని మూడపెల్లి గ్రామంలో నిర్మించిన రైతు వేదికలను జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్, ఎస్పీ రాహుల్ హెగ్డే జడ్పీ ఛైర్ పర్సన్ ఎన్.అరుణతో కలిసి సందర్శించారు.

ప్రారంభోత్సవానికి రైతు వేదికలు సిద్ధంగా ఉన్నాయని సంబంధిత అధికారులు కలెక్టర్, ఎస్పీకు తెలిపారు. కోనరావుపేట మండల కేంద్రంలోని రైతు వేదికతోపాటు పల్లె ప్రకృతి వనాన్ని వారు పరిశీలించారు. మూడపెల్లి గ్రామంలో నిర్మించిన రైతు వేదికకు కలపతో చేసిన ఫినిషింగ్ అందరినీ ఆకర్షిస్తుంది. గ్రామ సర్పంచ్ అంజిబాబు స్వయంగా ముందుకు వచ్చి తన సొంత డబ్బుతో ఈ వేదికను నిర్మించారు.

అనంతరం సిరిసిల్ల పట్టణంలో కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా నిర్మించిన ప్రభుత్వ పాఠశాలను జిల్లా కలెక్టర్, ఎస్పీ సందర్శించారు. వారి వెంట రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షులు గడ్డం నర్సయ్య, సంబంధిత మండలాల ఎంపీడీఓలు, తహసీల్దార్‌లు, తదితరులు ఉన్నారు.

Rajanna Sircilla collector Krishna Bhaskar and SP Rahul visited rythu vedika in Konaraopeta and Chandurti mandals
ప్రభుత్వ పాఠశాల, సిరిసిల్ల

ఇదీ చూడండి: 'థామస్​రెడ్డిపై కార్మికచట్టం ప్రకారం చర్యలు తప్పవు'

రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల కేంద్రంలో, చందుర్తి మండలంలోని మూడపెల్లి గ్రామంలో నిర్మించిన రైతు వేదికలను జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్, ఎస్పీ రాహుల్ హెగ్డే జడ్పీ ఛైర్ పర్సన్ ఎన్.అరుణతో కలిసి సందర్శించారు.

ప్రారంభోత్సవానికి రైతు వేదికలు సిద్ధంగా ఉన్నాయని సంబంధిత అధికారులు కలెక్టర్, ఎస్పీకు తెలిపారు. కోనరావుపేట మండల కేంద్రంలోని రైతు వేదికతోపాటు పల్లె ప్రకృతి వనాన్ని వారు పరిశీలించారు. మూడపెల్లి గ్రామంలో నిర్మించిన రైతు వేదికకు కలపతో చేసిన ఫినిషింగ్ అందరినీ ఆకర్షిస్తుంది. గ్రామ సర్పంచ్ అంజిబాబు స్వయంగా ముందుకు వచ్చి తన సొంత డబ్బుతో ఈ వేదికను నిర్మించారు.

అనంతరం సిరిసిల్ల పట్టణంలో కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా నిర్మించిన ప్రభుత్వ పాఠశాలను జిల్లా కలెక్టర్, ఎస్పీ సందర్శించారు. వారి వెంట రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షులు గడ్డం నర్సయ్య, సంబంధిత మండలాల ఎంపీడీఓలు, తహసీల్దార్‌లు, తదితరులు ఉన్నారు.

Rajanna Sircilla collector Krishna Bhaskar and SP Rahul visited rythu vedika in Konaraopeta and Chandurti mandals
ప్రభుత్వ పాఠశాల, సిరిసిల్ల

ఇదీ చూడండి: 'థామస్​రెడ్డిపై కార్మికచట్టం ప్రకారం చర్యలు తప్పవు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.