ETV Bharat / state

KTR Review On Floods: ప్రాణ, ఆస్తినష్టం జరగకుండా చూడాలి: కేటీఆర్‌

author img

By

Published : Jul 14, 2022, 4:51 PM IST

KTR Review On Floods: ఎన్నడూ లేనివిధంగా ఈ నెలలో అత్యధిక వర్షపాతం నమోదైందని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. భారీ వర్షాల దృష్ట్యా సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్​లో అధికారులు, కలెక్టర్‌తో సమీక్ష నిర్వహించారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని అధికారులకు సూచించారు.

KTR Review On Floods
KTR Review On Floods

KTR Review On Floods: భారీ వర్షాలతో ఎక్కడా ప్రాణ నష్టం జరగకుండా చూడాలని మంత్రి కేటీఆర్‌ అధికారులకు సూచించారు. నిర్మాణ పనులు జరిగే చోట హెచ్చరిక బోర్టులు పెట్టాలని స్పష్టం చేశారు. ఐదు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలపై రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్‌లో మంత్రి సమీక్ష నిర్వహించారు. జిల్లాలోని 666 చెరువుల పరిస్థితిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. అన్ని చెరువులు పటిష్ఠంగా ఉన్నాయని అధికారులు కేటీఆర్‌కు వివరించారు.

ఎన్నడూ లేని విధంగా సాధారణం కంటే 450 శాతం ఎక్కువ వర్షపాతం నమోదైందని కేటీఆర్‌ పేర్కొన్నారు. అధికారయంత్రాంగం ప్రాణ, ఆస్తినష్టం జరగకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. మున్సిపాలిటీ సహా అన్ని గ్రామాల్లో భద్రతా అడిట్ జరగాలని.. శిథిలావస్థలో ఉన్న ఇళ్లను తక్షణం ఖాళీ చేయించాలని సూచించారు. ప్రమాదకార బోరుబావులు, ఓపెన్ వెల్‌లను పూడ్చివేయాలని స్పష్టం చేశారు. సిరిసిల్లలో గత జరిగిన ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని అధికారులను కేటీఆర్‌ ఆదేశించారు.

ప్రాణనష్టం జరగకుండా చూడండి. ఇప్పటికే చాలా వరకు శిథిలావస్థలో ఉన్న భవనాలు కూల్చాం. నిర్మాణ పనులు జరిగే చోట హెచ్చరిక బోర్టులు పెట్టాలి. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా వైద్య, పంచాయతీశాఖలు పని చేయాలి.సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలి. పనులు జాప్యం చేసే కాంట్రాక్టర్లకు నోటీసులు జారీ చేయాలి.

-కేటీఆర్‌, ఐటీశాఖ మంత్రి

సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని కేటీఆర్ ఆదేశించారు. గ్రామాలు, పట్టణాల్లో నిరంతరం పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. మానేరు, మూలవాగు, నక్కవాగు పరీవాహక ప్రజలను చైతన్యపరచాలన్నారు. మీడియా ద్వారా వరదలపై ప్రచారం చేయించాలని.. మధ్యమానేరు నుంచి నీటివిడుదలకు ముందే ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. మధ్యమానేరు వద్దకు వెళ్లే సందర్శకులను నియంత్రించాలని.. పనుల్లో జాప్యం చేసే కాంట్రాక్ట్‌లను బ్లాక్ లిస్ట్‌లో పెట్టాలని ఆదేశించారు. భగీరథ నీరు కలుషితం కాకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి కేటీఆర్‌ అధికారులకు సూచించారు.

ప్రాణ, ఆస్తినష్టం జరగకుండా చూడాలి: కేటీఆర్‌

ఇవీ చదవండి: భద్రాచలాన్ని చుట్టుముట్టిన వరదనీరు.. డ్రోన్​ దృశ్యాల్లో గోదావరి ఉగ్రరూపం

వరుణుడి ప్రతాపంతో ఆ రాష్ట్రాలు గజగజ.. 29 గ్రామాలు ఖాళీ!

KTR Review On Floods: భారీ వర్షాలతో ఎక్కడా ప్రాణ నష్టం జరగకుండా చూడాలని మంత్రి కేటీఆర్‌ అధికారులకు సూచించారు. నిర్మాణ పనులు జరిగే చోట హెచ్చరిక బోర్టులు పెట్టాలని స్పష్టం చేశారు. ఐదు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలపై రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్‌లో మంత్రి సమీక్ష నిర్వహించారు. జిల్లాలోని 666 చెరువుల పరిస్థితిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. అన్ని చెరువులు పటిష్ఠంగా ఉన్నాయని అధికారులు కేటీఆర్‌కు వివరించారు.

ఎన్నడూ లేని విధంగా సాధారణం కంటే 450 శాతం ఎక్కువ వర్షపాతం నమోదైందని కేటీఆర్‌ పేర్కొన్నారు. అధికారయంత్రాంగం ప్రాణ, ఆస్తినష్టం జరగకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. మున్సిపాలిటీ సహా అన్ని గ్రామాల్లో భద్రతా అడిట్ జరగాలని.. శిథిలావస్థలో ఉన్న ఇళ్లను తక్షణం ఖాళీ చేయించాలని సూచించారు. ప్రమాదకార బోరుబావులు, ఓపెన్ వెల్‌లను పూడ్చివేయాలని స్పష్టం చేశారు. సిరిసిల్లలో గత జరిగిన ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని అధికారులను కేటీఆర్‌ ఆదేశించారు.

ప్రాణనష్టం జరగకుండా చూడండి. ఇప్పటికే చాలా వరకు శిథిలావస్థలో ఉన్న భవనాలు కూల్చాం. నిర్మాణ పనులు జరిగే చోట హెచ్చరిక బోర్టులు పెట్టాలి. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా వైద్య, పంచాయతీశాఖలు పని చేయాలి.సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలి. పనులు జాప్యం చేసే కాంట్రాక్టర్లకు నోటీసులు జారీ చేయాలి.

-కేటీఆర్‌, ఐటీశాఖ మంత్రి

సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని కేటీఆర్ ఆదేశించారు. గ్రామాలు, పట్టణాల్లో నిరంతరం పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. మానేరు, మూలవాగు, నక్కవాగు పరీవాహక ప్రజలను చైతన్యపరచాలన్నారు. మీడియా ద్వారా వరదలపై ప్రచారం చేయించాలని.. మధ్యమానేరు నుంచి నీటివిడుదలకు ముందే ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. మధ్యమానేరు వద్దకు వెళ్లే సందర్శకులను నియంత్రించాలని.. పనుల్లో జాప్యం చేసే కాంట్రాక్ట్‌లను బ్లాక్ లిస్ట్‌లో పెట్టాలని ఆదేశించారు. భగీరథ నీరు కలుషితం కాకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి కేటీఆర్‌ అధికారులకు సూచించారు.

ప్రాణ, ఆస్తినష్టం జరగకుండా చూడాలి: కేటీఆర్‌

ఇవీ చదవండి: భద్రాచలాన్ని చుట్టుముట్టిన వరదనీరు.. డ్రోన్​ దృశ్యాల్లో గోదావరి ఉగ్రరూపం

వరుణుడి ప్రతాపంతో ఆ రాష్ట్రాలు గజగజ.. 29 గ్రామాలు ఖాళీ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.