రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రంలో పనిచేస్తున్న హమాలీ కార్మికులు కలెక్టరేట్ వద్ద ధర్నాకు దిగారు. తమకు రూ.2 లక్షల బీమా, ప్రభుత్వ గుర్తింపు కార్డులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.
జిల్లాలోని 189 ఐకేపీ కేంద్రాల్లో సుమారు 5వేల మంది హమాలీ కార్మికులు జీవనోపాధి పొందుతున్నారని, అందరికీ కూలీ ఒకే విధంగా ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.