ETV Bharat / state

'గౌరవ వేతనం ఇవ్వాల్సిందే'

రూ.8,500 గౌరవ వేతనం ఇవ్వాలని కోరుతూ సిరిసిల్లలో పారిశుద్ధ్య కార్మికులు ధర్నా చేశారు. సీఎం కేసీఆర్​ ఇచ్చిన హామీ ఇప్పటి వరకు అమలు కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

author img

By

Published : Jul 2, 2019, 5:06 PM IST

Updated : Jul 2, 2019, 5:23 PM IST

ధర్నా చేస్తున్న కార్మికులు

సిరిసిల్లలోని మండల పరిషత్​ కార్యాలయం ముందు గ్రామపంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు ధర్నాకు దిగారు. రూ.8,500 గౌవర వేతనం ఇవ్వాలని డిమాండ్​ చేశారు. గత సంవత్సరం జులై 23న రాష్ట్ర వ్యాప్తంగా గ్రామపంచాయతీ కార్మికులు నిరవధిక సమ్మె చేశామన్నారు. అప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీని ఇప్పటి వరకు అమలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 11 నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు ఎలాంటి జీవో విడుదల చేయలేదన్నారు. పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్​లో పారిశుద్ధ్య కార్మికులకు రూ.18 వేలు ఇస్తున్నారని చెప్పారు.

'గౌరవ వేతనం ఇవ్వాల్సిందే'

ఇవీ చూడండి: ముంబయిలో 45ఏళ్ల వర్షపాతం రికార్డ్​ రిపీట్​!

సిరిసిల్లలోని మండల పరిషత్​ కార్యాలయం ముందు గ్రామపంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు ధర్నాకు దిగారు. రూ.8,500 గౌవర వేతనం ఇవ్వాలని డిమాండ్​ చేశారు. గత సంవత్సరం జులై 23న రాష్ట్ర వ్యాప్తంగా గ్రామపంచాయతీ కార్మికులు నిరవధిక సమ్మె చేశామన్నారు. అప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీని ఇప్పటి వరకు అమలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 11 నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు ఎలాంటి జీవో విడుదల చేయలేదన్నారు. పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్​లో పారిశుద్ధ్య కార్మికులకు రూ.18 వేలు ఇస్తున్నారని చెప్పారు.

'గౌరవ వేతనం ఇవ్వాల్సిందే'

ఇవీ చూడండి: ముంబయిలో 45ఏళ్ల వర్షపాతం రికార్డ్​ రిపీట్​!

Intro:TG_KRN_61_02_SRCL_PARISHUDDAKARMIKULA_DHARNA_AVB_G1_TS10040_HD

( )గ్రామపంచాయతీ కార్మికులకు రూ.8,500 గౌరవ వేతనం ప్రకటించాలని కోరుతూ సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయం ముందు పారిశుద్ధ్య కార్మికులు ధర్నా నిర్వహించారు. గత సంవత్సరం జూలై 23న రాష్ట్ర వ్యాప్తంగా గ్రామపంచాయతీ కార్మికులు నిరవధిక సమ్మె చేసినప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ ర్ ఇచ్చిన హామీని ఇప్పటి వరకు అమలు చేయడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. 11 నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు ఎలాంటి జీవో విడుదల చేయలేదన్నారు. పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పారిశుద్ధ కార్మికుల ను గుర్తించి రూ.18 వేల రూపాయలు గౌరవ వేతనం ప్రకటించడం జరిగిందన్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి కేసీఆర్ పారిశుద్ధ్య కార్మికులకు ఇచ్చిన హామీని నెరవేర్చుకోవాలని వారు కోరారు . అనంతరం ఎంపీడీవో విజయేందర్ రెడ్డి కి వినతి పత్రాన్ని అందజేశారు.

బైట్: గణేష్, జిల్లా కార్మిక సంఘ నాయకులు.


Body:srcl


Conclusion:పారిశుద్ధ్య కార్మికులకు గౌరవ వేతనం పెంచాలని కోరుతూ జిల్లా కేంద్రంలో లో ధర్నా.
Last Updated : Jul 2, 2019, 5:23 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.