గురుపౌర్ణమి పురస్కరించుకుని రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని సాయిబాబా ఆలయంలో అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఉదయాన్నే భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయం వద్దకు చేరుకుని సాయిబాబాను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. బాబాకు పాలాభిషేకం చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు పేర్కొన్నారు.
ఇవీ చూడండి: గురువుల పండుగ గురుపౌర్ణమి