లాక్డౌన్ వల్ల పశువులు ఆకలితో అలమటించకుండా దాతలు సాయం చేస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని శ్రీరాజరాజేశ్వర స్వామి దేవస్థానంలోని కోడెలకు కరీంనగర్ జిల్లా రామడుగు రైతులు పశుగ్రాసాన్ని పంపించారు.
యంత్రాలతో వరికోతలు పూర్తైనందున గ్రామాల్లోని రైతులంతా కలిసి నిర్ణయం తీసుకుని ట్రాక్టర్లతో పశుగ్రాసాన్ని తరలిస్తున్నారు. ఈరోజు కరీంనగర్ జిల్లాలోని పందికుంటపల్లి సర్పంచ్ కట్కం రవీందర్ ఆధ్వర్యంలో గ్రామంలోని యువకులు ట్రాక్టర్లలో పశుగ్రాసాన్ని వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి పంపించారు.