చైనా సైనికుల చేతిలో వీరమరణం పొందిన కల్నల్ సంతోష్ బాబుకు రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్లలో కాంగ్రెస్ నేతలు ఘన నివాళులు అర్పించారు. స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, టీపీసీసీ కార్యానిర్వాహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్లు పాల్గొన్నారు. కల్నల్ సంతోష్బాబు చిత్రపటానికి పూలమాలలు వేసి సంతాపం తెలిపారు.
హైదరాబాద్లో సంతోష్బాబు విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని జీవన్రెడ్డి డిమాండ్ చేశారు. ఆయన సతీమణికి గ్రూప్-1 ఉద్యోగమివ్వాలని, వారి నివాసానికి 1000 గజాల ఇంటిస్థలాన్ని కేటాయించాలని కోరారు.
ఇవీ చూడండి: కరోనా నిర్ధారణ కోసమెళ్తే.. అంటుకునేలా చేస్తున్నారు!