రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళపల్లి మండల కేంద్రంలోని పీహెచ్సీ సెంటర్లో సమావేశం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన రాజన్న సిరిసిల్ల జిల్లా డీఎంహెచ్ఓ చంద్రశేఖర్... తన చెప్పులను అటెండర్తో తుడిపించారు.
జిల్లాలో ఈ అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. చెప్పులు తుడుస్తున్న ఫోటోలు వైరల్ అయ్యాయి. దీనిపై డీఎంహెచ్ఓను వివరణ కోరగా, చెప్పులపై క్యాండిల్ మరకలు పడితే... చూడమన్నానని బదులిచ్చారు. ఇటీవల యువకులను చితకబాదిన పోలీసులపై చర్యలు తీసుకున్నారు ఉన్నాతాధికారులు. మరి ఈ విషయంలో సంబంధిత అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.
ఇవీ చూడండి : పారిశుద్ధ్య నిర్వహణపై మంత్రి ఎర్రబెల్లి అసంతృప్తి