పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలంలో నిర్వహించిన తెరాస ఆవిర్భావ వేడుకల్లో నాయకుల మధ్య వాగ్వాదం జరిగింది. జూలపల్లి మండల తెరాస అధ్యక్షుడు కాంతయ్య, జూలపల్లి గ్రామ శాఖ అధ్యక్షుడు రాజలింగం తానంటే తానే జెండా ఆవిష్కరణ చేస్తామని పోటీ పడ్డారు. ఈ వివాదం ఇద్దరి మధ్య వాగ్వాదానికి దారి తీసింది.
అనంతరం పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి జోక్యం చేసుకుని ఇరువురికి నచ్చజెప్పి ఆందోళన విరమింపజేశారు. ఈ వాగ్వాదం రాష్ట్ర గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ రఘువీర్ సింగ్ ముందే జరగడం స్థానికంగా చర్చనీయాంశమైంది.
ఇదీ చూడండి: కరోనా సోకకుండా ఏటీఎంలో ఇలా చేయండి!