ETV Bharat / state

ఓ వైపు గుంతలు, మరో వైపు ఇసుక లారీలు - ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు లారీలు బంద్

రోడ్లపై ఎక్కడ చూసినా గుంతలు... ఆపై రాత్రి పగలు తేడా లేకుండా తిరిగే ఇసుక లారీలు. దుమ్ము ఎగిసిపడుతూ వెనక వచ్చే వారికి దారి కనపడక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అదే కాటారం ముంథని పెద్దపల్లి రహదారి.

ఓ వైపు గుంతలు, మరో వైపు ఇసుక లారీలు
ఓ వైపు గుంతలు, మరో వైపు ఇసుక లారీలు
author img

By

Published : Dec 27, 2019, 1:36 PM IST

పెద్దపల్లి జిల్లా మంథని మీదుగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ కాటారం మండలాల నుంచి అనేక లారీలు అధిక సంఖ్యలో హైదరాబాద్ వైపు వెళ్తున్నాయి. గత రెండు రోజులు నుంచి ఈ రహదారి మొత్తం లారీలతో నిండిపోయింది. రాకపోకలకు తీవ్ర ఇభ్బందులు ఏర్పడుతున్నాయి. రోడ్లపై ఉన్న గుంతలు చాలవన్నట్లు అధిక సంఖ్యలో వాహనాలు తిరగడంతో చాలా సమస్యలొస్తున్నాయి. చివరకు అంబులెన్స్​లకు కూడా లారీల వల్ల దారి దొరకక నానా అవస్థలు పడుతున్నారు.

ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు

మహదేవపూర్, కాటారం మండలాల నుంచి వరంగల్ వైపు వెళ్లే ఇసుక లారీలను భూపాలపల్లి జిల్లా పాలనాధికారి ఆదేశాలతో మంథని వైపు మళ్ళించారు. అందువల్ల లారీలు అధిక సంఖ్యలో మంథని వైపు వస్తున్నాయి.మరో పక్కన మంథని పెద్దపల్లి రహదారి మరమ్మతులు జరుగుతుండటం వల్ల ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇసుక లారీల రాకపోకలను ఈ మార్గంలో అనుమతించడం లేదు.

పగలు రోడ్ల పక్కన.. రాత్రిళ్లు రోడ్లపై

మంథని మీదుగా గోదావరిఖని వైపు లారీలను మళ్ళిస్తుండడం వల్ల బసంత్ నగర్ వద్ద టోల్ ట్యాక్స్ చెల్లించాల్సి వస్తుందని, గోదావరిఖని మీదుగా వెళితే దూర భారం అని భావించి ఇసుక లారీ డ్రైవర్లు సాయంత్రం వరకు మంథని కాటారం పరిసర ప్రాంతాల్లో రహదారుల ప్రక్కన నిలుపుతున్నారు. ఈ లారీలు ఇష్టారీతిగా రోడ్లపై ప్రయాణించడం వల్ల ప్రయాణికులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. పెద్ద పెద్ద ప్రమాదాలు జరగక ముందే అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

ఓ వైపు గుంతలు, మరో వైపు ఇసుక లారీలు

ఇవీ చూడండి: కాళేశ్వరం ప్రాజెక్టులో ఇంజినీరింగ్​ కృషి అభినందనీయం: గవర్నర్

పెద్దపల్లి జిల్లా మంథని మీదుగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ కాటారం మండలాల నుంచి అనేక లారీలు అధిక సంఖ్యలో హైదరాబాద్ వైపు వెళ్తున్నాయి. గత రెండు రోజులు నుంచి ఈ రహదారి మొత్తం లారీలతో నిండిపోయింది. రాకపోకలకు తీవ్ర ఇభ్బందులు ఏర్పడుతున్నాయి. రోడ్లపై ఉన్న గుంతలు చాలవన్నట్లు అధిక సంఖ్యలో వాహనాలు తిరగడంతో చాలా సమస్యలొస్తున్నాయి. చివరకు అంబులెన్స్​లకు కూడా లారీల వల్ల దారి దొరకక నానా అవస్థలు పడుతున్నారు.

ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు

మహదేవపూర్, కాటారం మండలాల నుంచి వరంగల్ వైపు వెళ్లే ఇసుక లారీలను భూపాలపల్లి జిల్లా పాలనాధికారి ఆదేశాలతో మంథని వైపు మళ్ళించారు. అందువల్ల లారీలు అధిక సంఖ్యలో మంథని వైపు వస్తున్నాయి.మరో పక్కన మంథని పెద్దపల్లి రహదారి మరమ్మతులు జరుగుతుండటం వల్ల ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇసుక లారీల రాకపోకలను ఈ మార్గంలో అనుమతించడం లేదు.

పగలు రోడ్ల పక్కన.. రాత్రిళ్లు రోడ్లపై

మంథని మీదుగా గోదావరిఖని వైపు లారీలను మళ్ళిస్తుండడం వల్ల బసంత్ నగర్ వద్ద టోల్ ట్యాక్స్ చెల్లించాల్సి వస్తుందని, గోదావరిఖని మీదుగా వెళితే దూర భారం అని భావించి ఇసుక లారీ డ్రైవర్లు సాయంత్రం వరకు మంథని కాటారం పరిసర ప్రాంతాల్లో రహదారుల ప్రక్కన నిలుపుతున్నారు. ఈ లారీలు ఇష్టారీతిగా రోడ్లపై ప్రయాణించడం వల్ల ప్రయాణికులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. పెద్ద పెద్ద ప్రమాదాలు జరగక ముందే అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

ఓ వైపు గుంతలు, మరో వైపు ఇసుక లారీలు

ఇవీ చూడండి: కాళేశ్వరం ప్రాజెక్టులో ఇంజినీరింగ్​ కృషి అభినందనీయం: గవర్నర్

Intro:అమ్మో ఇసుక లారీలు.

అసలే రోడ్డుపై ఎక్కడపడితే అక్కడ గుంతలు తెలియని పరిస్థితి,ఆపై రాత్రి పగలు తేడా లేకుండా కట్టిన ఇసుక లారీలు లారీల వల్ల దుమ్ము ధూళి ఎగిసి పడుతుంది. ముందు వెనకా రహదారి కనపడక సమయానికి గమ్యస్థానాలకు చేరాలంటే ఆపసోపాలు పడుతున్న ప్రయాణికులు. అదే కాటారం మంథని పెద్దపల్లి రహదారి.

పెద్దపల్లి జిల్లా మంథని మీదుగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ కాటారం మండలాల నుంచి అనేక లారీలు అధిక సంఖ్యలో హైదరాబాద్ వైపు వెళ్తున్నాయి.

గత రెండు రోజులుగా కాటారం మంథని పెద్దపల్లి రహదారి ఈ లారీలతో నిండిపోయింది. రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుంది, మధ్యమధ్యలో ఈ వాహనాలు నడిరోడ్డుపై మరమ్మతులకు గురికావడం వల్ల రహదారిపై ఎక్కడికక్కడ అంతరాయం ఏర్పడి కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోతున్నాయి.ప్రయాణికులు దారిమధ్యలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, ఈ లారీల వల్ల అంబులెన్స్ లకు దారి దొరకక రోగులు సైతం ఇబ్బందులకు గురవుతున్నారు.

మహదేవపూర్ కాటారం మండలాల నుంచి వరంగల్ వైపు వెళ్లే ఇసుక లారీలను భూపాలపల్లి జిల్లా పాలనాధికారి ఆదేశాలతో మంథని వైపు మళ్ళించారు. దీనివల్ల లారీలు అధిక సంఖ్యలో మంథని వైపు వస్తున్నాయి.
మరో పక్కన మంథని పెద్దపల్లి రహదారి మరమ్మతులు జరుగుతుండటంతో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇసుక లారీల రాకపోకలను ఈ మార్గంలో అనుమతించడం లేదు.మంథని మీదుగా గోదావరిఖని వైపు లారీలను మళ్ళిస్తుండడంతో బసంత్ నగర్ వద్ద టోల్ ట్యాక్స్ చెల్లించాల్సి వస్తుందని, గోదావరిఖని మీదుగా వెళితే దూర భారం అని భావించి ఇసుక లారీ డ్రైవర్లు సాయంత్రం వరకు మంథని కాటారం పరిసర ప్రాంతాల్లో రహదారుల ప్రక్కన నిలుపుతున్నారు.
ఈ లారీలు ఇష్టారీతిగా రోడ్లపై ప్రయాణించడం వల్ల ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ముందు ముందు ప్రమాదాలు జరగక ముందు అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

బైట్. దుద్దిళ్ల శ్రీధర్ బాబు శాసనసభ్యులు మంథని.Body:యం.శివప్రసాద్, మంథని.Conclusion:9440728281.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.