ఫ్రెండ్లీ పోలీసింగ్లో భాగంగా పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ పోలీసులు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు విజ్ఞాన విహార యాత్ర చేపట్టారు. ఇందులో భాగంగా విద్యార్థులతో కలిసి సుందిళ్ల బ్యారేజ్, పార్వతి బ్యారేజ్, అన్నారం పంప్ హౌస్లను సందర్శించారు.
పిల్లలు ఎప్పుడూ చదువుతూనే ఉంటే, వారి మెదడుపై ఒత్తిడి పెరుగుతుందని పెద్దపల్లి డీసీపీ రవీందర్ పేర్కొన్నారు. మధ్య మధ్యలో ఇలా విహార యాత్రలకు తీసుకువెళ్లడం వల్ల వారిలో నూతన ఉత్సాహం నింపవచ్చన్నారు. ఈ ఉద్దేశంతోనే పిల్లలకు ఈ యాత్ర చేపట్టినట్లు తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోలీసులు ఎప్పుడూ అందుబాటులో ఉంటారని ఆయన వివరించారు.
ఇవీ చూడండి:'హయత్ నగర్లో చెడ్డి గ్యాంగ్ హల్ చల్... 3 ఇళ్లల్లో చోరీ'