పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని జవహర్నగర్ కాలీనీలో ఉన్న వాటర్ట్యాంకు ఎక్కి ఆత్మహత్యానికి ప్రయత్నించాడో యువకుడు. పట్టణానికి చెందిన అన్వర్కి కుటుంబ సమస్యలు ఎక్కువయ్యాయి. తట్టుకోలేక చనిపోవాలని వాటర్ ట్యాంక్ ఎక్కాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దిగాలని నచ్చజెప్పారు. అన్వర్ దిగనని మెండికేయడం వల్ల రెండు గంటలు పాటు అందరూ అక్కడే ఉండి అతడిని బతిమాలారు. చివరకు అన్వర్ కిందకు దిగాడు. వెంటనే పోలీసులు అతడిని పట్టుకొని స్టేషన్కి తీసుకెళ్లారు. కౌన్సిలింగ్ ఇచ్చి ఇంటికి పంపిచారు.
ఇవీ చూడండి: 'రాత్రంతా కబడ్డీ.. ఒక్కరోజు సెలవు ఇవ్వండి సార్'