ETV Bharat / state

తన నివాసంలో ఎమ్మెల్యే శ్రీధర్​బాబు దీక్ష - తన నివాసంలో బైఠాయించి ఎమ్మెల్యే శ్రీధర్​బాబు దీక్ష

గోదావరి నదిపై పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలంటూ కాంగ్రెస్​ నిర్వహిస్తున్న జలదీక్షకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకుంటున్నారని నిరసిస్తూ పెద్దపల్లి జిల్లా మంథనిలో తన నివాసంలో ఎమ్మెల్యే శ్రీధర్​బాబు దీక్ష చేపట్టారు. కొండపోచమ్మ ప్రాజెక్టు ప్రారంభమప్పుడు గుర్తురాని కరోనా వ్యాప్తి ఇప్పుడు కాంగ్రెస్​ జలదీక్ష చేస్తామంటే గుర్తొచ్చిందా అంటూ మండిపడ్డారు.

mla srishar babu deeksha at manthani to allow him to jaldeeksha
తన నివాసంలో బైఠాయించి ఎమ్మెల్యే శ్రీధర్​బాబు దీక్ష
author img

By

Published : Jun 13, 2020, 12:51 PM IST

పెద్దపల్లి జిల్లా మంథనిలో ఎమ్మెల్యే శ్రీధర్​బాబు తన నివాసంలో బైఠాయించి దీక్ష చేపట్టారు. ఈ నేపథ్యంలో ఆయన ఇంటి ముందు పోలీసుల అధిక సంఖ్యలో మోహరించారు. గోదావరి నదిపై పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలంటూ కాంగ్రెస్​ ఆధ్వర్యంలో నిర్వహించే జలదీక్షలో పాల్గొనేందుకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు ప్రభుత్వం చూస్తోందని శ్రీధర్​బాబు ఆరోపించారు.

అప్పడు గుర్తురాలేదా?

సీఎం కేసీఆర్, మంత్రులతో కలిసి కొండపోచమ్మ ప్రారంభోత్సవానికి వెళ్లినప్పుడు కరోనా వైరస్​ వ్యాప్తి గుర్తురాలేదా అంటూ ప్రశ్నించారు. మంథనిలో ప్రాజెక్టులు కట్టినా.. అక్కడి ప్రజలకు నీరు ఇవ్వకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్​ నాయకుల అరెస్ట్​లను ఖండిస్తూ శ్రీధర్​బాబు ఇంట్లోనే దీక్ష చేస్తున్నారు.

ఇదీ చదవండి:ఆడుకున్న ఇంటిని కూల్చేశారు.. ఆడించిన నాన్నను చంపేశారు!

పెద్దపల్లి జిల్లా మంథనిలో ఎమ్మెల్యే శ్రీధర్​బాబు తన నివాసంలో బైఠాయించి దీక్ష చేపట్టారు. ఈ నేపథ్యంలో ఆయన ఇంటి ముందు పోలీసుల అధిక సంఖ్యలో మోహరించారు. గోదావరి నదిపై పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలంటూ కాంగ్రెస్​ ఆధ్వర్యంలో నిర్వహించే జలదీక్షలో పాల్గొనేందుకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు ప్రభుత్వం చూస్తోందని శ్రీధర్​బాబు ఆరోపించారు.

అప్పడు గుర్తురాలేదా?

సీఎం కేసీఆర్, మంత్రులతో కలిసి కొండపోచమ్మ ప్రారంభోత్సవానికి వెళ్లినప్పుడు కరోనా వైరస్​ వ్యాప్తి గుర్తురాలేదా అంటూ ప్రశ్నించారు. మంథనిలో ప్రాజెక్టులు కట్టినా.. అక్కడి ప్రజలకు నీరు ఇవ్వకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్​ నాయకుల అరెస్ట్​లను ఖండిస్తూ శ్రీధర్​బాబు ఇంట్లోనే దీక్ష చేస్తున్నారు.

ఇదీ చదవండి:ఆడుకున్న ఇంటిని కూల్చేశారు.. ఆడించిన నాన్నను చంపేశారు!

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.