ETV Bharat / state

'స్పీకప్​ తెలంగాణలో భాగస్వాములు కండి.. ప్రశ్నించండి' - speak up telangana

ప్రభుత్వ వైఫల్యాలాను ప్రశ్నించేందుకు కాంగ్రెస్​ పార్టీ ఆధ్వర్యంలో "స్పీకప్​ తెలంగాణ" పేరిట ఆన్​లైన్​ ఉద్యమం ప్రారంభించినట్లు పెద్దపల్లి జిల్లా మంథని ఎమ్మెల్యే శ్రీధర్​బాబు తెలిపారు. ఈ ఆన్​లైన్​ ఉద్యమంలో ప్రజలందరూ స్వచ్ఛందంగా పాల్గొని ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని సూచించారు.

mla sridhar babu started speak up telangana protest under congress party
mla sridhar babu started speak up telangana protest under congress party
author img

By

Published : Jul 18, 2020, 8:04 PM IST

కరోనా కట్టడిలో తెరాస సర్కారు వైఫల్యాన్ని ఎండగడుతూ కాంగ్రెస్ పార్టీ "స్పీకప్ తెలంగాణ" పేరిట ఆన్​లైన్​ ఉద్యమం చేపట్టినట్లు ఎమ్మెల్యే శ్రీధర్​బాబు తెలిపారు. పీసీసీ టాస్క్​ఫోర్స్ నేతృత్వంలో అన్ని సామాజిక మాధ్యమాల ద్వారా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నామని పెద్దపల్లి జిల్లా మంథనిలో వెల్లడించారు. కరోనా వ్యాధి వ్యాప్తి చెందకుండా అన్ని చర్యలు తీసుకున్నామని అసెంబ్లీలో ప్రకటించిన సీఎం.. రోజురోజుకు పెరుగుతున్న కేసులపై ఎందుకు స్పందించటంలేదని నిలదీశారు.

కరోన వైద్య పరీక్షలు, చికిత్సలు ఆరోగ్యశ్రీలో చేర్చాలని... పేద, మధ్యతరగతి ప్రజలకు వైద్యం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్రంలో కరోనా పరీక్షల సంఖ్య పెంచాలన్నారు. కొవిడ్​తో మృతి చెందిన వారి కుటుంబానికి ప్రభుత్వం పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఆన్​లైన్​ ఉద్యమంలో ప్రజలందరూ స్వచ్ఛందంగా పాల్గొని ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని సూచించారు.

ఇదీ చూడండి: 35 ప్యాకెట్ల గంజాయి స్వాధీనం.. ఇద్దరు వ్యక్తులు అరెస్ట్

కరోనా కట్టడిలో తెరాస సర్కారు వైఫల్యాన్ని ఎండగడుతూ కాంగ్రెస్ పార్టీ "స్పీకప్ తెలంగాణ" పేరిట ఆన్​లైన్​ ఉద్యమం చేపట్టినట్లు ఎమ్మెల్యే శ్రీధర్​బాబు తెలిపారు. పీసీసీ టాస్క్​ఫోర్స్ నేతృత్వంలో అన్ని సామాజిక మాధ్యమాల ద్వారా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నామని పెద్దపల్లి జిల్లా మంథనిలో వెల్లడించారు. కరోనా వ్యాధి వ్యాప్తి చెందకుండా అన్ని చర్యలు తీసుకున్నామని అసెంబ్లీలో ప్రకటించిన సీఎం.. రోజురోజుకు పెరుగుతున్న కేసులపై ఎందుకు స్పందించటంలేదని నిలదీశారు.

కరోన వైద్య పరీక్షలు, చికిత్సలు ఆరోగ్యశ్రీలో చేర్చాలని... పేద, మధ్యతరగతి ప్రజలకు వైద్యం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్రంలో కరోనా పరీక్షల సంఖ్య పెంచాలన్నారు. కొవిడ్​తో మృతి చెందిన వారి కుటుంబానికి ప్రభుత్వం పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఆన్​లైన్​ ఉద్యమంలో ప్రజలందరూ స్వచ్ఛందంగా పాల్గొని ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని సూచించారు.

ఇదీ చూడండి: 35 ప్యాకెట్ల గంజాయి స్వాధీనం.. ఇద్దరు వ్యక్తులు అరెస్ట్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.