ETV Bharat / state

మంథని మున్సిపల్ ఛైర్​పర్సన్ పుట్ట శైలజపై కేసు నమోదు

author img

By

Published : Apr 6, 2021, 9:31 PM IST

వామన్​రావు దంపతుల హత్య కేసులో నిందితుడు బిట్టు శ్రీనుతో మంథని కోర్టు ఆవరణలో వీడియో కాల్ చేయించిన మంథని మున్సిపల్ ఛైర్​పర్సన్ పుట్ట శైలజపై కేసు నమోదైంది.

Manthani
మంథని

పెద్దపల్లి జిల్లా మంథని మున్సిపల్ ఛైర్​పర్సన్ పుట్ట శైలజపై మంథని పోలీస్ స్టేషన్​లో కేసు నమోదైంది. వామన్​రావు దంపతుల హత్య కేసులో నిందితుడు బిట్టు శ్రీను 164 స్టేట్మెంట్ రికార్డ్ కోసం పోలీసులు గతనెల 19న మంథని కోర్టుకు తీసుకొచ్చారు.

ఆ సమయంలో కోర్టు ప్రాంగణంలో మున్సిపల్ ఛైర్​పర్సన్ పుట్ట శైలజ నిందితుడితో వీడియో కాల్ చేయించినట్లు ఆర్​ఎస్​ఐ ప్రవీణ్ ఫిర్యాదు చేశారు. నిందితుడితో ఫోన్​లో మాట్లాడించవద్దని వారించినా వీడియో కాల్ కొనసాగించినట్లు ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. కోర్టు ఆదేశంతో సెక్షన్ 186 కింద కేసు నమోదు చేశారు.

పెద్దపల్లి జిల్లా మంథని మున్సిపల్ ఛైర్​పర్సన్ పుట్ట శైలజపై మంథని పోలీస్ స్టేషన్​లో కేసు నమోదైంది. వామన్​రావు దంపతుల హత్య కేసులో నిందితుడు బిట్టు శ్రీను 164 స్టేట్మెంట్ రికార్డ్ కోసం పోలీసులు గతనెల 19న మంథని కోర్టుకు తీసుకొచ్చారు.

ఆ సమయంలో కోర్టు ప్రాంగణంలో మున్సిపల్ ఛైర్​పర్సన్ పుట్ట శైలజ నిందితుడితో వీడియో కాల్ చేయించినట్లు ఆర్​ఎస్​ఐ ప్రవీణ్ ఫిర్యాదు చేశారు. నిందితుడితో ఫోన్​లో మాట్లాడించవద్దని వారించినా వీడియో కాల్ కొనసాగించినట్లు ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. కోర్టు ఆదేశంతో సెక్షన్ 186 కింద కేసు నమోదు చేశారు.

ఇదీ చదవండి: కరోనాతో ప్రైవేటు ఆస్పత్రులకు పరుగులు.. చికిత్స కోసం అప్పులపాలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.