ETV Bharat / state

'దళితుల భూములను కొల్లగొడుతున్నారు'

author img

By

Published : Sep 3, 2020, 5:14 PM IST

పెద్దపల్లి జిల్లా కేంద్రంలో చేపట్టిన రిలే దీక్షలో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పాల్గొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్... దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని చెప్పి.. ఇచ్చిన హామీలను విస్మరించారని ఆరోపించారు.

'దళితుల భూములను కొల్లగొడుతున్నారు'
'దళితుల భూములను కొల్లగొడుతున్నారు'

దళితుల భూములను రాష్ట్ర ప్రభుత్వం కొల్లగొడుతోందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ ఆరోపించారు. భూములు సాధన కోసం పెద్దపల్లి జిల్లా కేంద్రంలో చేపట్టిన రిలే దీక్షలో ఆయన పాల్గొన్నారు. తెలంగాణ వాదంతో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్... దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని ఇచ్చిన హామీలను విస్మరించారని పేర్కొన్నారు. రెండోసారి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి... ప్రభుత్వ భూములను ఆక్రమిస్తూ దళితులను మోసం చేస్తున్నట్లు చెప్పారు.

2023 లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసి ఎమ్మార్పీఎస్ అధికారంలోకి వస్తుందని భరోసా ఇచ్చారు. నిరుపేద ప్రజలు, దళిత వర్గాలు తనకు తోడుగా ఉండాలని కోరారు. భూముల పరిరక్షణ కోసం గత నెల రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా రీలే దీక్షలు చేపడుతున్నట్లు చెప్పారు.

దళితుల భూములను రాష్ట్ర ప్రభుత్వం కొల్లగొడుతోందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ ఆరోపించారు. భూములు సాధన కోసం పెద్దపల్లి జిల్లా కేంద్రంలో చేపట్టిన రిలే దీక్షలో ఆయన పాల్గొన్నారు. తెలంగాణ వాదంతో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్... దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని ఇచ్చిన హామీలను విస్మరించారని పేర్కొన్నారు. రెండోసారి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి... ప్రభుత్వ భూములను ఆక్రమిస్తూ దళితులను మోసం చేస్తున్నట్లు చెప్పారు.

2023 లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసి ఎమ్మార్పీఎస్ అధికారంలోకి వస్తుందని భరోసా ఇచ్చారు. నిరుపేద ప్రజలు, దళిత వర్గాలు తనకు తోడుగా ఉండాలని కోరారు. భూముల పరిరక్షణ కోసం గత నెల రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా రీలే దీక్షలు చేపడుతున్నట్లు చెప్పారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.