పెద్దపల్లి నీటిపారుదల శాఖ డీఈ రవికాంత్ బిల్లుల చెల్లింపుల విషయంలో గుత్తేదారుల వద్ద 80 వేల రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలానికి చెందిన గుత్తేదారు కావటి రాజు మూడో విడత మిషన్ కాకతీయ పథకంలో 5 పనులు పూర్తి చేశాడు. బిల్లుల చెల్లింపులో డీఈ రవికాంత్ను గుత్తేదారు సంప్రదించాడు. బిల్లుల నిధులు చెల్లించాలంటే లక్ష రూపాయలు లంచం కావాలని రవికాంత్ డిమాండ్ చేశాడు. గుత్తేదారు రాజు అవినీతి నిరోధక శాఖ అధికారులను ఆశ్రయించాడు. అనంతరం బాధితుడు డీఈ డ్రైవర్కు 80 వేల రూపాయలు లంచం ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.
ఇవీ చూడండి : 'మాయ మాటలు చెప్పి... నా కూతుర్ని ఎత్తుకెళ్లాడు'