పెద్దపల్లి జిల్లా మంథని సామాజిక ఆరోగ్య కేంద్రంలో కరోనా టెస్టుల కోసం వచ్చిన ప్రజలు ఎండ వేడి తట్టుకోలేక చెప్పులను వరుసలో ఉంచి నీడలో సేద తీరుతున్నారు. మండలంలోని ప్రజలు ఉదయం ఆరు గంటలకే చేరుకుంటున్నారు. ఉదయం 10 గంటల నుంచి ఓపీ, పరీక్షలు ప్రారంభిస్తున్నారు.

రోజూ 35 నుంచి 40 కరోనా నిర్ధరణ కిట్లు మాత్రమే కేటాయిస్తున్నారని వైద్యులు తెలిపారు. పరీక్షలు అవసరం లేకున్నా కొందరు వస్తున్నారని పేర్కొన్నారు. రోజూ సుమారు 80 నుంచి 100 మంది వరకు నిర్ధరణ పరీక్షల కోసం వైద్యశాలకు వస్తున్నారని తెలిపారు. ఈ క్రమంలో ఎండలో నిలబడలేక అలసిపోయి సేద తీరారు.
ఇదీ చదవండి: 'అన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. వారు దూరమయ్యారు'