ETV Bharat / state

శ్రీరాంసాగర్​ పైకి పర్యటకులకు అనుమతి నిరాకరణ

author img

By

Published : Oct 22, 2019, 5:41 PM IST

సుదూర ప్రాంతాల నుంచి శ్రీరాంసాగర్​ ప్రాజెక్టు సందర్శనకు వచ్చిన పర్యటకులు సాగర్​ అందాలు చూడటానికి అనుమతి ఇవ్వడం లేదని అధికారులపై నిరసన వ్యక్తం చేశారు. భద్రత పేరిట ప్రాజెక్టును చూడటానికి అనుమతించడం లేదని వాపోయారు.

శ్రీరాంసాగర్​ ప్రాజెక్టు సందర్శకులు

నిజామాబాద్​ జిల్లా మెండోరాలో శ్రీరాంసాగర్​ ప్రాజెక్టు వద్ద పర్యటకులు ఆందోళనకు దిగారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సందర్శకులు ప్రాజెక్టు అందాల్ని చూడటానికి అధికారులు అనుమతించడం లేదని నిరసన వ్యక్తం చేశారు. కొందరు అధికారులు తమకు కావాల్సిన వారిని ప్రాజెక్టు చూడటానికి అనుమతిస్తూ పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ప్రాజెక్టు పైకి వాహనాలు అనుమతించినా.. పార్కింగ్​ పేరిట డబ్బు వసూల్​ చేస్తున్నారని వాపోయారు. డ్యాం పక్కనే ఉన్న నెహ్రూ పార్క్​ వద్ద పార్కింగ్​ ఫీజు వసూల్​ చేయాలి.. కానీ అక్రమార్కులు ప్రాజెక్టు పైకి వెళ్లే వాహనాల నుంచి పార్కింగ్​ రుసుం వసూలు చేస్తున్నారని ఆరోపించారు. అధికారులకు ఫిర్యాదు చేసినా.. చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని విమర్శించారు.

శ్రీరాంసాగర్​ ప్రాజెక్టు సందర్శకులు

నిజామాబాద్​ జిల్లా మెండోరాలో శ్రీరాంసాగర్​ ప్రాజెక్టు వద్ద పర్యటకులు ఆందోళనకు దిగారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సందర్శకులు ప్రాజెక్టు అందాల్ని చూడటానికి అధికారులు అనుమతించడం లేదని నిరసన వ్యక్తం చేశారు. కొందరు అధికారులు తమకు కావాల్సిన వారిని ప్రాజెక్టు చూడటానికి అనుమతిస్తూ పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ప్రాజెక్టు పైకి వాహనాలు అనుమతించినా.. పార్కింగ్​ పేరిట డబ్బు వసూల్​ చేస్తున్నారని వాపోయారు. డ్యాం పక్కనే ఉన్న నెహ్రూ పార్క్​ వద్ద పార్కింగ్​ ఫీజు వసూల్​ చేయాలి.. కానీ అక్రమార్కులు ప్రాజెక్టు పైకి వెళ్లే వాహనాల నుంచి పార్కింగ్​ రుసుం వసూలు చేస్తున్నారని ఆరోపించారు. అధికారులకు ఫిర్యాదు చేసినా.. చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని విమర్శించారు.

శ్రీరాంసాగర్​ ప్రాజెక్టు సందర్శకులు
Intro:నిజామాబాద్ జిల్లా మెండోరా మండలం లోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు వద్ద పర్యాటకుల సందడి నెలకొంది నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ హైదరాబాద్ తదితర దూర ప్రాంతాల నుండి పర్యాటకులు తరలి వస్తున్నారు


Body:అయితే పర్యాటకులు ప్రాజెక్టు అధికారులపై మరియు పోలీసులపై తమ నిరసనను తెలియజేస్తున్నారు అధికారులు ప్రాజెక్టు యొక్క అందాలను చూడడానికి అనుమతించ డం లేదని సుదూర ప్రాంతాలనుండి ఇ వచ్చినప్పటికీ నిరాశగా వెళ్లాల్సి వస్తోందని వాపోయారు ప్రాజెక్ట్ పైకి వాహనాలు అనుమతించిన ప్పటికీ అక్రమార్కులు పార్కింగ్ ఫీజు పేరిట వసూలు చేయడం దారుణం అన్నారు వాస్తవంగా డ్యాం పక్కనే గల నెహ్రూ పార్క్ వద్ద వాహనాలు నిలిపితే పార్కింగ్ ఫీజు వసూలు చేయాల్సి ఉంటుంది కానీ అక్రమార్కులు ఇదే అదనుగా డ్యాం సైడ్ వచ్చిన ప్రతి బండికి పార్కింగ్ వసూలు చేయడం జరుగుతుంది దీనిని అధికారులు కూడా చూసీచూడనట్లు వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది


Conclusion:ప్రజలు ఎంతోమంది వస్తున్నప్పటికీ సెక్యూరిటీ పేరిట కనీసం డ్యాం కింది భాగంలో కూడా పర్యాటకులను అనుమతించకపోవడం దారుణం అన్నారు ఇదే విషయంపై ప్రాజెక్టు అధికారులకు పర్యాటకులకు వివాదం తలెత్తడంతో మెండోరా ఎస్ఐ సురేష్ వచ్చి పర్యాటకులకు నచ్చ చెప్పి తిప్పి పంపారు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.