నిజామాబాద్ జిల్లా భాజపా నాయకులు దన్పాల్ సూర్యనారాయణ జన్మదినం సందర్భంగా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాసుపత్రిలో పనిచేస్తున్న సెక్యూరిటీ సిబ్బందికి నిత్యావసరాలు అందజేశారు.
కరోనా మహమ్మారి కాలంలో ప్రజలకు సేవలు అందిస్తున్న వైద్యులు, ఇతర సిబ్బంది సేవలు మరవలేనివని ఆయన పేర్కొన్నారు. కొవిడ్-19 అంతమయ్యేవరకు ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ఇదీ చూడండి : దుర్గం చెరువుపై కేబుల్ బ్రిడ్జి నిర్మాణం... చూపరులకు కనువిందు