ETV Bharat / state

'2024లో కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉంటుంది'

author img

By

Published : Mar 16, 2023, 10:38 PM IST

Revanth Reddy Padayatra: తెలంగాణకు ద్రోహం చేసిన వ్యక్తికి రెండు సార్లు అధికారాన్ని ఇస్తే.. తెలంగాణను ఇచ్చిన కాంగ్రెస్​కు ఒక్కసారి అవకాశం ఇవ్వండని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి ప్రజలను విజ్ఞప్తి చేశారు. నేడు నిజామాబాద్​ జిల్లాలోని బోధన్​లో జరిగిన పాదయాత్ర సభలో ప్రసగించారు. రేవంత్​రెడ్డి గో బ్యాక్​ అంటూ బీఆర్​ఎస్​ కార్యకర్తలు నినాదాలు చేయడంతో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది.

revanth reddy
revanth reddy

Revanth Reddy Padayatra: నాడు కాంగ్రెస్​ ఇచ్చిన తెలంగాణను.. నేడు కేసీఆర్​ తన రాజకీయ స్వార్థం కొరకు ఉపయోగించుకుంటున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి ఆరోపించారు. ఇలా చేసిన వ్యక్తికి రెండుసార్లు అవకాశం ఇస్తే.. మరి తెలంగాణను ఇచ్చిన కాంగ్రెస్​ పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నేడు నిజామాబాద్​ జిల్లా బోధన్​ మండలంలోని బహిరంగ సభలో రేవంత్​ ప్రసంగించి.. వరాలు కురిపించారు. నాడు పార్లమెంటు తలుపులు మూసేసి తెలంగాణను కాంగ్రెస్​ పార్టీ అన్యాయంగా ఇచ్చిందని బీజేపీ విమర్శలు చేస్తే.. ఇచ్చినందుకు తాము ధన్యవాదాలు తెలుపుతున్నామని చెప్పారు.

కొత్త సంవత్సరంతో కొత్త ప్రభుత్వం 2024 జనవరి1 నాడు తెలంగాణలో కాంగ్రెస్​ ప్రభుత్వమే అధికారంలో ఉంటుందని రేవంత్​రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఆనాడు అధికారంలో ఉన్నప్పుడు ఎలాగైతే 42 లక్షల ఇందిరమ్మ ఇళ్లు పేదలకు అందించామో.. 2024లో రాష్ట్రంలో ఇళ్లు లేని పేదలకు రూ.5 లక్షలు ఉచితంగా ఇచ్చి ఆదుకుంటామని హామీ ఇచ్చారు. పేద ప్రజలకు రాజీవ్​ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఇప్పుడిస్తున్న రూ.2 లక్షలు కాకుండా.. రూ.5 లక్షలు ఇస్తామని స్పష్టం చేశారు. రైతులకు రూ.2 లక్షలు రుణమాఫీ చేసి రైతులను ఆదుకునే బాధ్యతను కాంగ్రెస్​ పార్టీ తీసుకుంటుందని చెప్పారు.

కాంగ్రెస్​ పార్టీ అధికారంలోకి వస్తే నిరుద్యోగుల కోసం సంవత్సరం లోపే రెండు లక్షల ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తామని రేవంత్​రెడ్డి హామీ ఇచ్చారు. నాడు కాంగ్రెస్​ ప్రభుత్వం మహిళలు క్యాన్సర్​ బారిన పడకుండా దీపం పథకం పెట్టి రూ.400కే సిలిండర్​, గ్యాస్​ ఇచ్చారు. కానీ నేడు బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సిలిండర్ ధర రూ.1200లకు చేరుకుందని ప్రకటించారు. అదే కాంగ్రెస్​ అధికారంలోకి వస్తే సిలిండర్​ను రూ.500లకే ఇస్తామని స్పష్టం చేశారు. నిజామాబాద్​ రైతులు చెరుకు, పసుపును పండించి ఆదర్శంగా నిలిచారని తెలిపారు. రైతుబంధు కింద రూ. 15000 ఇవ్వడమే కాదు. భూమిలేని నిరుపేదలకు, ఉపాధి హామీ కూలీలకు సంవత్సరానికి రూ. 12000 ఇచ్చి కాంగ్రెస్​ పార్టీ ఆదుకుంటుందన్నారు. ఇవి అన్నీ కావాలంటే ఇందిరమ్మ రాజ్యం రావాలని.. చివరిగా బైబై కేసీఆర్​ అంటూ సమావేశాన్ని రేవంత్​రెడ్డి ముగించారు.

గో బ్యాక్​ రేవంత్​రెడ్డి అంటూ బీఆర్​ఎస్​ కార్యకర్తల నినాదాలు: రేవంత్ రెడ్డి పాదయాత్ర సభలో నల్ల జెండాలతో బీఆర్​ఎస్​ శ్రేణులు ఒక్కసారిగా నిరసన తెలిపారు. రేవంత్​రెడ్డి గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తూ.. ఆయన మాట్లాడుతున్న వాహనం వద్దకు రావడానికి ప్రయత్నం చేశారు. వారిని పోలీసులు అడ్డుకుని స్టేషన్​కి తరలించారు. సభ ముగిసిన అనంతరం వారిని పోలీసులు విడిచిపెట్టారు. కాంగ్రెస్ శ్రేణులు అరెస్ట్ చేసిన వారిని ఎలా విడిచిపెడతారంటూ స్టేషన్​లో బైఠాయించారు.

ఇవీ చదవండి:

Revanth Reddy Padayatra: నాడు కాంగ్రెస్​ ఇచ్చిన తెలంగాణను.. నేడు కేసీఆర్​ తన రాజకీయ స్వార్థం కొరకు ఉపయోగించుకుంటున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి ఆరోపించారు. ఇలా చేసిన వ్యక్తికి రెండుసార్లు అవకాశం ఇస్తే.. మరి తెలంగాణను ఇచ్చిన కాంగ్రెస్​ పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నేడు నిజామాబాద్​ జిల్లా బోధన్​ మండలంలోని బహిరంగ సభలో రేవంత్​ ప్రసంగించి.. వరాలు కురిపించారు. నాడు పార్లమెంటు తలుపులు మూసేసి తెలంగాణను కాంగ్రెస్​ పార్టీ అన్యాయంగా ఇచ్చిందని బీజేపీ విమర్శలు చేస్తే.. ఇచ్చినందుకు తాము ధన్యవాదాలు తెలుపుతున్నామని చెప్పారు.

కొత్త సంవత్సరంతో కొత్త ప్రభుత్వం 2024 జనవరి1 నాడు తెలంగాణలో కాంగ్రెస్​ ప్రభుత్వమే అధికారంలో ఉంటుందని రేవంత్​రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఆనాడు అధికారంలో ఉన్నప్పుడు ఎలాగైతే 42 లక్షల ఇందిరమ్మ ఇళ్లు పేదలకు అందించామో.. 2024లో రాష్ట్రంలో ఇళ్లు లేని పేదలకు రూ.5 లక్షలు ఉచితంగా ఇచ్చి ఆదుకుంటామని హామీ ఇచ్చారు. పేద ప్రజలకు రాజీవ్​ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఇప్పుడిస్తున్న రూ.2 లక్షలు కాకుండా.. రూ.5 లక్షలు ఇస్తామని స్పష్టం చేశారు. రైతులకు రూ.2 లక్షలు రుణమాఫీ చేసి రైతులను ఆదుకునే బాధ్యతను కాంగ్రెస్​ పార్టీ తీసుకుంటుందని చెప్పారు.

కాంగ్రెస్​ పార్టీ అధికారంలోకి వస్తే నిరుద్యోగుల కోసం సంవత్సరం లోపే రెండు లక్షల ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తామని రేవంత్​రెడ్డి హామీ ఇచ్చారు. నాడు కాంగ్రెస్​ ప్రభుత్వం మహిళలు క్యాన్సర్​ బారిన పడకుండా దీపం పథకం పెట్టి రూ.400కే సిలిండర్​, గ్యాస్​ ఇచ్చారు. కానీ నేడు బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సిలిండర్ ధర రూ.1200లకు చేరుకుందని ప్రకటించారు. అదే కాంగ్రెస్​ అధికారంలోకి వస్తే సిలిండర్​ను రూ.500లకే ఇస్తామని స్పష్టం చేశారు. నిజామాబాద్​ రైతులు చెరుకు, పసుపును పండించి ఆదర్శంగా నిలిచారని తెలిపారు. రైతుబంధు కింద రూ. 15000 ఇవ్వడమే కాదు. భూమిలేని నిరుపేదలకు, ఉపాధి హామీ కూలీలకు సంవత్సరానికి రూ. 12000 ఇచ్చి కాంగ్రెస్​ పార్టీ ఆదుకుంటుందన్నారు. ఇవి అన్నీ కావాలంటే ఇందిరమ్మ రాజ్యం రావాలని.. చివరిగా బైబై కేసీఆర్​ అంటూ సమావేశాన్ని రేవంత్​రెడ్డి ముగించారు.

గో బ్యాక్​ రేవంత్​రెడ్డి అంటూ బీఆర్​ఎస్​ కార్యకర్తల నినాదాలు: రేవంత్ రెడ్డి పాదయాత్ర సభలో నల్ల జెండాలతో బీఆర్​ఎస్​ శ్రేణులు ఒక్కసారిగా నిరసన తెలిపారు. రేవంత్​రెడ్డి గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తూ.. ఆయన మాట్లాడుతున్న వాహనం వద్దకు రావడానికి ప్రయత్నం చేశారు. వారిని పోలీసులు అడ్డుకుని స్టేషన్​కి తరలించారు. సభ ముగిసిన అనంతరం వారిని పోలీసులు విడిచిపెట్టారు. కాంగ్రెస్ శ్రేణులు అరెస్ట్ చేసిన వారిని ఎలా విడిచిపెడతారంటూ స్టేషన్​లో బైఠాయించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.